AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబ్బాక దెబ్బతో మా ఓటింగ్ శాతం పెరిగింది.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా..

దుబ్బాక దెబ్బతో తెలంగాణలో మా ఓటింగ్ శాతం పెరిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన నడ్డా మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

దుబ్బాక దెబ్బతో మా ఓటింగ్ శాతం పెరిగింది.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా..
uppula Raju
|

Updated on: Nov 28, 2020 | 7:49 AM

Share

దుబ్బాక దెబ్బతో తెలంగాణలో మా ఓటింగ్ శాతం పెరిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన నడ్డా మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ అభివ‌ృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మేయర్ పీటం కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్నామని, ఇప్పుడు దుబ్బాక దెబ్బతో తెలంగాణలో బీజేపీ మరింత మెరుగైందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీజేపీకి మద్ధతు తెలిపిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి ముందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జేపీ నడ్డా అన్నిడివిజన్ల‌లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. కొత్తపేట నుంచి నాగోల్ వరకు రోడ్‌ షోలో పాల్గొన్నారు. కేవలం మునిసిపల్ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేస్తున్నారని కొన్ని పార్టీలు బహిరంగంగా విమర్శించినా.. కమలాన్ని వికసింపజేసేందుకు మేము ఎక్కడికైనా వస్తామని ప్రకటించారు. అశేషంగా వచ్చిన ప్రజలను చూస్తుంటే తెలంగాణలో రాబోయే కాలంలో బీజేపీ జెండా పాతడం కాయమన్నారు. కాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ ఈ రోజు హైదరాబాద్ ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా భారత్ బయోటెక్‌ను సందర్శిస్తారు. ఇక రేపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

Follow Us
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ తోపు.. కానీ బౌలింగ్ చూస్తేనే భయం వేస్తోంది
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ తోపు.. కానీ బౌలింగ్ చూస్తేనే భయం వేస్తోంది
ఓటీటీలో 'దృశ్యం' దర్శకుడి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 'దృశ్యం' దర్శకుడి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
మగధీర మూవీలో చిరంజీవికి డూప్‌గా నటించింది ఎవరో తెల్సా
మగధీర మూవీలో చిరంజీవికి డూప్‌గా నటించింది ఎవరో తెల్సా
దేవుడి ఫొటోలు ఎప్పుడు కడగాలి..? 99శాతం మంది చేసే తప్పులివే..
దేవుడి ఫొటోలు ఎప్పుడు కడగాలి..? 99శాతం మంది చేసే తప్పులివే..
బంగారం ధరలపై సంచలనం.. త్వరలో రూ.11 లక్షలకు..
బంగారం ధరలపై సంచలనం.. త్వరలో రూ.11 లక్షలకు..