భారీ కుట్రకు ఐసీస్ ప్లాన్..

భారత్‌లో భారీ విధ్వంసానికి ఐసీస్ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకంటే ముందే.. దేశంలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్లాన్ వేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు భద్రతాదళాలను హెచ్చరించారు. సోమవారం జరగనున్న బక్రీద్ ప్రార్థనల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఐబీ హెచ్చరించింది. ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులను టార్గెట్‌గా చేసుకుని దాడులకు తెగబడే అవకాశం ఉందన్నారు. ఐసిస్ సహకారంతో జేషే, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ కుట్రకు తేరలేపినట్లు ఐబీ […]

భారీ కుట్రకు ఐసీస్ ప్లాన్..
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2019 | 2:32 PM

భారత్‌లో భారీ విధ్వంసానికి ఐసీస్ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకంటే ముందే.. దేశంలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ ప్లాన్ వేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు భద్రతాదళాలను హెచ్చరించారు. సోమవారం జరగనున్న బక్రీద్ ప్రార్థనల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఐబీ హెచ్చరించింది. ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులను టార్గెట్‌గా చేసుకుని దాడులకు తెగబడే అవకాశం ఉందన్నారు. ఐసిస్ సహకారంతో జేషే, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ కుట్రకు తేరలేపినట్లు ఐబీ గుర్తించింది.

కాగా, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు.. కశ్మీర్‌ను విభజించిన విషయం తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌లో దాడులకు ఉగ్రమూకలను పురిగొల్పే విధంగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారత్‌లో పుల్వామా తరహా దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఉగ్రమూకలు మరింత రెచ్చిపోనున్నాయని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.