AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indigo Flights: సంక్షోభంపై ఇండిగో కీలక ప్రకటన.. సర్వీసుల పునరుద్దరణపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది..

ఇండిగో విమానాలు భారీగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. కేంద్రం కూడా దీనిపై సీరియస్ అయింది. సర్వీసుల పునరుద్దరణ వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇండిగో కీలక ప్రకటన చేసింది.

Indigo Flights: సంక్షోభంపై ఇండిగో కీలక ప్రకటన.. సర్వీసుల పునరుద్దరణపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది..
Venkatrao Lella
|

Updated on: Dec 07, 2025 | 2:35 PM

Share

Indigo Services: దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్ధగా పేరు పొందిన ఇండిగో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఫైలెట్లు లేక కనీసం విమానాలను నడపలేని స్థితికి వచ్చేసింది. ఏకంగా దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా విమానాలను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు ఆందోళనకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వృద్దులు, పిల్లలు తమ గొడును వెల్లబోసుకున్న వీడియోలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో సంక్షోభంపై స్పందించిన కేంద్రం.. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సర్వీసులు పునురుద్దరించాలని కోరింది. ఈ క్రమంలో ఇండిగో నుంచి కీలక ప్రకటన వచ్చింది. సర్వీసులు ఎప్పుడు పునరుద్దరిస్తామనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

మరో 10 రోజుల్లో సర్వీసులన్నీ పునరుద్దరిస్తామని ఇండిగో వెల్లడించింది. సంక్షోభం నుంచి మరో కొద్దిరోజుల్లో బయటపడతామని, ఎప్పటిలాగే సర్వీసులను ప్రయాణికులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా నేడు 650 విమానలు రద్దు చేశామని, 1650 సర్వీసులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని స్పష్టం చేసింది. డిసెంబర్ 10 నాటికి కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని, సర్వీసుల అంతరాయం కారణంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఇతర ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారంది. ఇండిగో రోజూ 2,300 విమానాలను నడుపుతోంది. మంగళవారం నుంచి 2వేలకుపైగాస సర్వీసులను రద్దు చేయగా.. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో 115, ముంబైలో 112, ఢిల్లీలో 109, చెన్నైలో 38, అమృత్‌సర్‌లో 11 విమానాలు రద్దయ్యాయి.

ఈ క్రమంలో దేశంలో అత్యంత దారుణమైన విమానయాన సంక్షోభంగా దీనిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పేర్కొంది. దీనిపై ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రయాణీకులకు డిసెంబర్ 7 రాత్రి 8 గంటలలోపు పెండింగ్‌లో ఉన్న టికెట్ల రీఫండ్‌ను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఇతర సంస్థలు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో దేశీయ విమానాలపై ఛార్జీల కేంద్రం పరిమితులను విధించింది. తాము నిర్ణయించిన ఛార్జీలన మాత్రమే అమలు చేయాలని, పరిస్థితి చక్కబడే వరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

Follow Us