AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: 21 టార్గెట్‌లు.. 25 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్

ఆపరేషన్ సిందూర్ పై సైన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది. భారతదేశంపై జరిగిన ఉగ్రవాద దాడి వీడియోతో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఇది పహల్గామ్‌లో జరిగిన దాడిని కూడా చూపించింది.. దీనిలో 26 మంది మరణించారు. దశాబ్ద కాలంలో 350 మంది భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారని ఆ వీడియోలో వివరించారు.

Operation Sindoor: 21 టార్గెట్‌లు.. 25 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్
Operation Sindoor
Shaik Madar Saheb
|

Updated on: May 07, 2025 | 11:47 AM

Share

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. బిహార్‌లో ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగానే వారి స్థావరాల్లో వారికి సమాధి కట్టేశారు. ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. చెప్పి మరీ ఎటాక్ చేసిన భారత సైన్యం. దాడులకు కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ ట్వీట్‌ చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట 28 నిమిషాలకు దాడికి సిద్ధం.. గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్‌ చేసింది. ఒంటి గంట 51 నిమిసాలకు ఆపరేషన్‌ ముగిసాక న్యాయం జరిగింది.. జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్‌ చేసింది. ఆపరేషన్ సింధూర్‌ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని మోదీ. వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించారు. కాగా.. ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఆపరేషన్ సిందూర్ పై సైన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది. భారతదేశంపై జరిగిన ఉగ్రవాద దాడి వీడియోతో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఇది పహల్గామ్‌లో జరిగిన దాడిని కూడా చూపించింది.. దీనిలో 26 మంది మరణించారు. దశాబ్ద కాలంలో 350 మంది భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారని ఆ వీడియోలో వివరించారు. పాక్‌ ఉగ్రమూకలు లక్ష్యంగా ఆపరేషన్‌ సింధూర్‌ కొనసాగినట్లు సైన్యం వెల్లడించింది. నిర్ధిష్ట లక్ష్యాలు టార్గెట్‌గా పాక్‌పై దాడులు జరిగాయని.. పాక్‌లోని లష్కరే, జైషే, హిజ్బుల్‌ స్థావరాలు విజయవంతంగా ధ్వంసం అయ్యాయని ప్రతినిధులు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. మొత్తం 21 ప్రాంతాల్లోని స్థావరాలపై భారత్‌ విరుచుకుపడింది. అంతర్జాతీయ సరిహద్దులు దాటి దాడి చేసిన భారత్‌.. పౌర, సైనిక స్థావరాలకు నష్టం కలుగుకుండా కచ్చితత్వం పాటించింది. కసబ్‌, హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలు ధ్వంసం చేసింది.  శాటిలైట్‌ చిత్రాలతో దాడులను సైతం భారత్‌ వివరించింది. దేశ ప్రయోజనాల కోసం తన హక్కును భారత్‌ ఉపయోగించుకుందని.. బాధ్యతాయుతంగానే దాడి చేశామని భారత్ ప్రకటించింది.

లైవ్ వీడియో ..

పహల్గామ్ ఉగ్రవాద దాడి అనాగరికమైనదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. కుటుంబం ముందే ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు. దాడి చేసిన TRF కి లష్కర్ తో సంబంధం ఉంది. దాడి తర్వాత, వారిని సమాచారం ఇవ్వమని అడిగారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో వారికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించుకుంది. పాకిస్తాన్ ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తోంది. ఉగ్రవాదుల గురించి అబద్ధాలు చెబుతోందని పేర్కొన్నారు.

మేము మా హక్కును వినియోగించుకున్నాము: MEA

ఈ రోజు భారతదేశం తన హక్కును వినియోగించుకుందని విదేశాంగ కార్యదర్శి అన్నారు. మేము అన్నింటి ప్రకారం చర్య తీసుకున్నాము. మేము ప్రత్యుత్తరం ఇచ్చే హక్కును వినియోగించుకున్నాము. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసే లక్ష్యంతో ఈ చర్య జరిగిందన్నారు.

25 నిమిషాల్లో 21 లక్ష్యాలపై భారత్ దాడి చేసింది..

ఆపరేషన్ గురించి పూర్తి సమాచారం అందించామని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. పాకిస్తాన్ పై తెల్లవారుజామున 1:05 గంటలకు దాడి జరిగిందని ఆమె తెలిపారు. ఈ ఆపరేషన్‌లో 9 చోట్ల దాడి జరిగింది. ఈ ఆపరేషన్ మధ్యాహ్నం 1.05 నుండి 1.30 వరకు కొనసాగింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా లక్ష్యంపై దాడి జరిగింది. ఉగ్రవాద దాడి కుట్రదారులపై దాడి జరిగింది. పాకిస్తాన్ – పీఓకే రెండింటిపైనా దాడులు జరిగాయి. మేము పౌరులకు హాని చేయలేదు. ముందుగా, సవాయి నాలా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నాము.. మేము జైషే, లష్కర్ శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాము. 9 చోట్ల 21 లక్ష్యాలపై దాడి జరిగింది. పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో దాడి జరిగింది. ఇక్కడి సర్జల్ శిబిరంపై దాడి జరిగింది. ఇక్కడ ఒక హిజ్బుల్ శిబిరం ఉండేదని తెలిపారు.

Follow Us