India Coronavirus: భారత్‌లో ఫోర్త్ వేవ్ అలజడి.. ఒక్కసారిగా 90 శాతం పెరిగిన కరోనా కేసులు..

India Covid-19 Updates: దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం

India Coronavirus: భారత్‌లో ఫోర్త్ వేవ్ అలజడి.. ఒక్కసారిగా 90 శాతం పెరిగిన కరోనా కేసులు..
Coronavirus In India

Edited By:

Updated on: Apr 18, 2022 | 11:42 AM

India Covid-19 Updates: దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచిఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వేయికి అటుఇటుగా నమోదైన (Coronavirus) కేసులు.. మళ్లీ ఒక్కసారిగా రెండు వేల మార్క్ దాటాయి. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసు పాటిజివిటీ రేటు ఒక్కసారిగా పెరుగుతుంటడంతో కేంద్రం అప్రమత్తమైంది. జనవరి తర్వాత పాజిటివిటీ రేటు 35 శాతానికి చేరుకుంది. ఢిల్లీ, యూపీ, హర్యానా రాష్ట్రాల్లో కేసులు రెండింతలు పెరిగాయి. యూపీలో 141%, హర్యానాలో 118% మేర కేసులు పెరిగాయి. దీంతోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని ప్రాంతాల్లోనే కేసుల సంఖ్య అధికంగా ఉంది. అయితే.. దేశవ్యాప్తంగా 11 వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు కాస్త.. ఆదివారం ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఫోర్త్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • దేశంలో గత 24 గంటల్లో (ఆదివారం) 2,183 కేసులు నమోదు కాగా.. 214 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే 90 శాతం కేసులు (1150) పెరిగాయి.
  • తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కేసుల సంఖ్య 4,30,44,280 కి చేరింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 521965 కి పెరిగింది.
  • ప్రస్తుతం దేశంలో 11,542 (0.03 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • నిన్న కరోనా నుంచి 1985 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,10,773 కి చేరింది. రికవరీ రేటు 98.76 శాతం ఉంది.
  • ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 186,54,94,355 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న 2,66,459 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
  • దేశంలో నిన్న 2,61,440 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి 83.21 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.

Also Read:

Anemia: ఈ పదార్ధాలతో కూడా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు.. అవేంటో తెలుసుకోవడం మీకే మంచిది..

Andhra Pradesh: తూర్పు గోదావరిలో ఘోరం.. బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం.

 

Loading...
Unable to load recommendations.
Follow Us