AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor Highlights: రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకుని దాడులు చేశాం : రాజ్ నాథ్ సింగ్

Venkata Chari

| Edited By: Ram Naramaneni

Updated on: May 08, 2025 | 7:07 PM

పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాది స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది.

Operation Sindoor Highlights: రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకుని దాడులు చేశాం : రాజ్ నాథ్ సింగ్
Operation Sindoor

పహల్గామ్ ప్రతీకారం మొదలైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించింది. భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని 9 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం దాడి తర్వాత, లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలను తదుపరి 48 గంటలు మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన సమయంలో, జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్-రాజౌరి ప్రాంతంలోని భింబర్ గాలిలో ఫిరంగి కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ దుర్మార్గపు చర్యకు భారత సైన్యం తగిన సమాధానం ఇస్తోంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 May 2025 07:01 PM (IST)

    అదంతా తప్పుడు ప్రచారం.. ఫ్యాక్ట్ చెక్ రిలీజ్ చేసిన భారత్

    పాకిస్తాన్ అనుకూల హ్యాండిల్స్‌లో భారత రాఫెల్ జెట్‌ను కూల్చివేసినట్లు తప్పుడు ప్రచారానికి పాల్పడుతన్నారని.. భారత్ ఫ్యాక్ట్ చెక్ రిలీజ్ చేసింది. పాత చిత్రాలను ఇప్పటివిగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది.

  • 07 May 2025 08:34 PM (IST)

    ఆపరేషన్ సిందూర్​పై కాంగ్రెస్ రియాక్షన్- పూర్తి మద్దతు ప్రకటించిన ఖర్గే

    ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ను కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది.  భారత భద్రతా దళాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. పాక్‌పై భారత్ ఆర్మీ దాడుల నేపథ్యంలో..  కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది.  సైనికుల దృఢ సంకల్పం, దేశ భక్తికి మేం సెల్యూట్ చేస్తున్నాం సమావేశం అనంతరం ఖర్గే చెప్పారు.

  • 07 May 2025 08:03 PM (IST)

    పహల్గాం ఉగ్రదాడి సమాచారం ఇవ్వాలని పౌరులను కోరిన NIA

    పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం ఫోటోలు వీడియోలు లాంటివి ఏమైనా, తమకు అందించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీని ద్వారా టెర్రరిస్టులను గుర్తించడానికి, వాళ్లు అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకోవడానికి వీలవుతుందని తెలిపింది. ఇలా కాల్ చేసిన వారితో నేరుగా సీనియర్​ NIA అధికారి మాట్లాడుతారు.

    సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నంబర్లు ఇవే!

    • మొబైల్ నంబర్ – 9654958816
    • ల్యాండ్‌లైన్ నంబర్ – 011-24368800
  • 07 May 2025 06:45 PM (IST)

    వివిధ దేశాల భద్రతా సలహాదారులతో మాట్లాడిన అజిత్‌ దోవల్

    పలు దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో  అజిత్‌ దోవల్ మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వారికి వివరాలు తెలియజేశారు. అమెరికా, రష్యా, యూకే , చైనా, ఫ్రాన్స్‌, సౌదీ, జపాన్ జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడిన దోవల్.. ఉద్రిక్తతలు పెంచాలనే ఉద్దేశం భారత్‌కు లేదన్నారు. ఉద్రిక్తతలు పెంచాలని పాకిస్తాన్ యత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని చెప్పారు. భవిష్యత్తులోనూ మిత్రదేశాలతో సమాచారం పంచుకుంటామని స్పష్టం చేశారు.

  • 07 May 2025 06:20 PM (IST)

    ఆ రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా ఎమర్జెన్సీ మీటింగ్

    ‘ఆపరేషన్ సిందూర్ ‘ నేపథ్యంలో పాకిస్తాన్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి ‌అమిత్ షా అత్యవసర మీటింగ్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన భేటీలో జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. లద్దాఖ్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు.

  • 07 May 2025 05:58 PM (IST)

    హనుమంతుడే మాకు ఆదర్శం: రాజ్‌నాథ్‌ సింగ్‌

    ‘ఆపరేషన్ సిందూర్​’లో లంకా దహనం చేసిన ఆంజనేయుడే తమకు ఆదర్శమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.  అశోక వనానికి వెళ్ళేటప్పుడు పవన పుత్రుడు అనుసరించిన సూత్రాన్ని ఈ దాడిలో తాము అనుసరించినట్లు రాజ్​నాథ్ వివరించారు. తమ అమాయక పౌరులను చంపిన వారిని మాత్రమే తాము టార్గెట్‌గా చేసుకున్నట్లు రక్షణ మంత్రి తెలిపారు. తన గడ్డపై జరిగిన దాడికి ప్రతిస్పందించే హక్కును భారత్​కు ఉందని రాజ్​నాథ్ స్పష్టం చేశారు.

  • 07 May 2025 05:24 PM (IST)

    రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకుని దాడులు చేశాం : రాజ్ నాథ్ సింగ్

    దేశ భద్రతకు భంగం కలిగిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించం అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అమాయకులను చంపిన వారినే మేము చంపామని తెలిపారు. పహల్గామ్ లో దాడి చేసిన టెర్రరిస్టుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీని దాడి చేసి తమ సత్తా ఏంటో చూపించింది. పాక్ ప్రజల ప్రాణాలకు ఎలాంటి నష్టం చేయలేదని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. రైట్ టూ రెస్పాండ్ హక్కును వాడుకున్నామని తెలిపారు.

    ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుత్రువులకు తగిన విధంగా బుద్ది చెప్పామని వెల్లడించారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నారని.. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామని రాజ్ నాథ్ తెలిపారు.

  • 07 May 2025 05:00 PM (IST)

    భారత్‌ దాడితో పాక్‌ కకావికలం

    భారత్‌ జరిపిన ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌ ఉక్కిరిబిక్కరవుతోంది. ఎటూపాలుపోని స్థితిలో యావత్‌ పాక్‌ యంత్రాంగం తలలు దించుకున్న పరిస్థితి. పరిస్థితిని సమీక్షించేందుకు పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ అత్యవసరంగా నిర్వహించిన నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో పాల్గొన్న వారంతా తలలదించుకొని గంభీరంగా కనిపించారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి చేయలేమనే భావన అందరి కళ్లలో కనిపించింది.

  • 07 May 2025 04:51 PM (IST)

    పహల్గామ్ ఉగ్రదాడి అమానవీయ ఘటన -రిటైర్డ్‌ మేజర్ ఒబెరాయ్‌

    యుద్ధం వస్తే పాకిప్తాన్ ఆరు రోజుల్లో చేతులెత్తేయడం ఖాయమని.. పాకిస్తాన్‌ ఆర్మీకి భారత జవాన్లతో పోరాడే ధైర్యం లేదన్నారు రిటైర్డ్‌ ఆర్మీ మేజర్ ఒబెరాయ్‌. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ చేసిన దాడి భారతీయులకు గర్వకారణమని పీఓకేని భారత్ స్వాధీనం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని అన్నారు రిటైర్డ్‌ ఆర్మీ మేజర్ ఒబెరాయ్‌.

  • 07 May 2025 04:24 PM (IST)

    ఆపరేషన్ సింధూర్‌ను పూర్తిగా స్వాగతిస్తున్నాం- మల్లికార్జున ఖర్గే

    ఆపరేషన్ సింధూర్‌ను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఉగ్రదాడికి భారత్ ధీటైన జవాబు ఇచ్చిందని ఆయన తెలిపారు. భద్రతా దళాల ధైర్యం, దేశభక్తి ఎంతో గొప్పదన్నారు. ఉగ్రదాడి జరిగినప్పుడే కేంద్రానికి, సైన్యానికి అండగా ఉంటామని చెప్పామన్నారు

  • 07 May 2025 04:19 PM (IST)

    కొనసాగుతున్న మాక్‌ డ్రిల్స్‌..

    దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ప్రారంభమైంది. భారత్‌-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు.. దేశవ్యాప్తంగా 244 ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్స్‌ జరుగుతున్నాయి.. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ చేపట్టారు. సరిగ్గా 4 గంటల నుంచి 4:30 వరకు మాక్‌ డ్రిల్ సాగనుంది. ముందుగా పోలీస్‌ సైరన్‌, ఇండస్ట్రియల్‌ సైరన్ మోగాయి..

  • 07 May 2025 03:15 PM (IST)

    రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రధాని మోదీ

    ఆపరేషన్ సిందూర్ అనంతరం తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని మోదీ కలిశారు. ఆపరేషన్ సింధూర్‌పై రాష్ట్రపతికి ప్రధాని మోదీ వివరించారు. అంతేకాకుండా.. ప్రస్తుత పరిస్థితులు.. మాక్ డ్రిల్ తదితర అంశాల గురించి చర్చించారు.

  • 07 May 2025 02:57 PM (IST)

    రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

    ఆపరేషన్ సింధూర్‌ వివరాలు వెల్లడించేందుకు ప్రభుత్వం రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ భేటీలో పాల్గొననున్నారు.

  • 07 May 2025 01:54 PM (IST)

    ఆపరేషన్ సింధూర్ అప్ డేట్స్

    భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదన్నారు యూఏఈ ఉప ప్రధానమంత్రి షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌. సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని… శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని యూఏఈ సూచించింది.

  • 07 May 2025 01:53 PM (IST)

    ఆపరేషన్ సింధూర్ అప్ డేట్స్

    భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌. శాంతియుత పరిష్కారం దిశగా చర్చలు జరపాలన్నారు.

  • 07 May 2025 01:53 PM (IST)

    ఆపరేషన్ సింధూర్ అప్ డేట్స్

    ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు తెలిపింది. ఆపరేషన్ సింధూర్‌ను సమర్థిస్తూ ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది. ఉగ్రవాదంపై భారత సైనిక చర్యలు సరైనవేనంటూ సమర్థించింది. ఆత్మరక్షణ కోసం భారత్‌కు దాడి చేసే హక్కు ఉందన్నారు ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజర్

  • 07 May 2025 01:52 PM (IST)

    ఆపరేషన్ సింధూర్ అప్ డేట్స్

    చైనా అన్నిరకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందన్నారు. శాంతి, స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలని భారత్, పాకిస్తాన్ దేశాలను కోరుతున్నామని ప్రకటించింది చైనా. ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలంది చైనా. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను దూరంగా ఉండాలని కోరింది.

  • 07 May 2025 01:49 PM (IST)

    ఆపరేషన్‌ సింధూర్‌ అప్ డేట్స్

    భారత్‌ ఆపరేషన్‌పై ఎప్పటికప్పుడు క్లోజ్‌గా మానిటర్‌ చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. భారత్ యాక్షన్‌కి కౌంటర్‌గా పాక్‌ ఎటువంటి చర్య తీసుకోవద్దు.. భారత్‌పై యుద్ధానికి పాక్ ధైర్యం చెయ్యొద్దన్నారు. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్‌కి ఉంది.. ఆపరేషన్ సింధూర్‌పై పాక్‌ మౌనంగా ఉంటే మంచిదని సూచించారు.

  • 07 May 2025 01:49 PM (IST)

    ఆపరేషన్‌ సింధూర్‌ అప్ డేట్స్

    ఆపరేషన్‌ సింధూర్‌పై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు. ఇరుదేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు. ఈ దాడులు త్వరగా ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరన్నారు. ఘర్షణలు వద్దు..ప్రపంచానికి శాంతి కావాలన్నారు ట్రంప్.

  • 07 May 2025 01:45 PM (IST)

    ఆపరేషన్ సింధూర్ అప్ డేట్స్..

    ఆపరేషన్‌ సింధూర్‌పై మిత్ర దేశాలకు భారత్‌ సమాచారం ఇచ్చింది. అమెరికా, యూకే, రష్యా, సౌదీ, యూఏఈ సహా.. పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడారు ఉన్నతాధికారులు. టెర్రర్‌ క్యాంప్‌లపై దాడికి కారణాల్ని వివరించింది భారత్. ‌

  • 07 May 2025 01:44 PM (IST)

    ఆపరేషన్ సింధూర్ అప్‌డేట్స్..

    భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్ చెక్‌పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. భారత్‌ ఆర్మీని ఎదురుకోలేక సామాన్య ప్రజలపై కాల్పులు జరుపుతుంది పాక్‌ సైన్యం. కశ్మీర్‌ సహా ఎల్‌వోసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. యూరీ, కుప్వారా, రాజౌరి-పూంచ్ సెక్టార్లలో కాల్పులు జరుగుతున్నాయి. పాక్‌ సైన్యం కాల్పులను తిప్పికొడుతుంది భారత సైన్యం.

  • 07 May 2025 01:39 PM (IST)

    బర్నాల బింబర్‌ క్యాంప్‌ ధ్వంసం

    LOCకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాదస్థావరం బర్నాల బింబర్‌ క్యాంప్‌. ఇది ఉగ్రవాదులకు ఆయుధాల ఉపయోగం, IEDల తయారీ, అడవుల్లో మనుగడ సాగించడం వంటి విషయాల్లో ఉగ్రమూకలకు ఇది శిక్షణ ఇచ్చే కేంద్రం. ఇది కూడా భారత్‌ జరిపిన ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైంది.

  • 07 May 2025 01:38 PM (IST)

    భారత్‌ ఎటాక్‌తో పాకిస్తాన్‌ గడ్డపై ఉగ్రమూకలు ఛిన్నాభిన్నం

    పాక్‌లో పన్నెండో అతిపెద్ద నగరం బహావల్‌ పూర్‌. లాహోర్‌ నుంచి నాలుగొందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి జామియా మసీదు సుభాన్ అల్లా కాంప్లెక్స్‌ నుంచి జైషే మహమ్మద్‌ కార్యకలాపాలు సాగిస్తుంది. ఈ భవనానికి ఉస్మాన్‌ ఓ-అలీ క్యాంపస్‌ అనే పేరు కూడా ఉంది. దాదాపు 18 ఎకరాల్లో ఇది ఉంటుంది. రిక్రూట్‌మెంట్‌, నిధుల సేకరణను జైష్‌ దీన్ని ఉపయోగిస్తోంది. జైషే మహమ్మద్‌ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజార్‌ బహావల్‌పూర్‌లోనే పుట్టాడు. ఇక్కడే అత్యంత పటిష్ఠమైన భవనంలోనే అతని నివాసం. జైషే మహమ్మద్‌ అంటే మహమ్మద్‌ సైన్యమని అర్థం. పాక్‌ సైన్యానికి చెందిన 31 కార్ప్స్‌ హెడ్‌క్వార్టర్స్‌కు కొద్ది దూరంలోనే జైషే మహమ్మద్‌ క్యాంప్‌ ఉంటుంది. ఇంత దగ్గరగా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుందంటే దానికి ISI సంపూర్ణ సహకారం ఉందనే విషయం తేటతెల్లవుతోంది. ఈ ప్రాంగణంలో ఒక భారీ మసీదు ఉంది. ఇందులో ఉన్న మదర్సాలో 600 మంది శిక్షణ పొందుతున్నారు. ఇందులో స్విమ్మింగ్‌ పూల్‌, గుర్రాల స్టేబుల్‌, జిమ్‌ కూడా ఉంది.

  • 07 May 2025 01:38 PM (IST)

    ఆపరేషన్ సింధూర్‌ అప్ డేట్స్..

    – బహావల్‌పూర్‌ ఉగ్రవాద శిబిరం..

    – ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ హెడ్‌క్వార్టర్‌ ఇదే

    – పుల్వామా, పార్లమెంట్‌పై దాడి వెనుక జైష్‌ హస్తం ఉంది

    – బహావల్‌ పూర్ అనేది పాక్‌లో 12వ అతిపెద్ద నగరం

    – ఇక్కడున్న జామియా మసీద్‌ సుభాన్ అల్లా కాంప్లెక్స్‌ నుంచి జైషే మహమ్మద్‌ కార్యకలాపాలు

    – దీనికే ఉస్మాన్‌ ఓ-అలీ క్యాంపస్‌ అని పేరు

    – దాదాపు 18 ఎకరాల్లో ఈ టెర్రర్‌ క్యాంప్‌

    – జైషే మహమ్మద్‌ అంటే మహమ్మద్‌ సైన్యమని అర్థం..

    -పాక్‌ సైన్యానికి చెందిన 31 కార్ప్స్‌ హెడ్‌క్వార్టర్స్‌కు కొద్ది దూరంలోనే ఈ జైషే మహమ్మద్‌ క్యాంప్‌

    – ఈ జైషే మదర్సాలో 600 మందికి ఉగ్ర శిక్షణ

  • 07 May 2025 01:37 PM (IST)

    ఆపరేషన్ సింధూర్‌ అప్ డేట్స్..

    – ఆపరేషన్ సింధూర్‌తో నామరూపాల్లేకుండా పోయిన జైషే మహ్మద్‌

    – మసూద్ అజర్‌ కుటుంబంలో 14 మంది హతం

    – నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదంటూ మసూద్‌ అజర్‌ ఏడుపు

    – మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేసిన మసూద్‌

    – ప్రధాని మోదీ అన్ని నియమాలూ ఉల్లంఘించారంటూ ఆక్రోశం

    – మిసైళ్ల దాడిలో నేలమట్టమైన మసూద్‌ బహావల్‌పూర్‌ డెన్‌

    – జైషే మహ్మద్‌ చీఫ్‌ కుటుంబం సహా నలుగురు సన్నిహితుల హతం

    – భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మసూద్‌ ఏడుపులు

    – ఇక భారత్‌పై జాలి చూపను అంటూ మసూద్‌ బీరాలు

    – భయం లేదు.. నిరాశ లేదు.. దుఖం లేదు అంటూ లేఖ

  • 07 May 2025 01:36 PM (IST)

    ఆపరేషన్‌ సింధూర్‌ అప్ డేట్స్..

    ఈ అర్థరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒకటిన్నర మధ్య ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టామని భారత సైన్యానికి చెందిన కల్నల్‌ సోఫియా ఖురేషి తెలిపారు. ఈ ఆపరేషన్ ఎలా నిర్వహించింది, వేటిని లక్ష్యంగా చేసుకున్నారో ఆ వివరాలు సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వింగ్ కమాండర్‌ వ్యోమికా సింగ్ వెల్లడించారు.

  • 07 May 2025 01:25 PM (IST)

    విశాఖలో సివిల్‌ మాక్‌డ్రిల్‌

    — ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విశాఖలోనూ సివిల్‌ మాక్‌డ్రిల్‌

    — అత్యవసర పరిస్థితుల్లో పౌరులు ఏం చేయాలో చెబుతూ అవేర్‌నెస్‌

    — యుద్ధ వాతావరణంలో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన

    — ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా సివిల్‌ మాక్‌డ్రిల్‌

  • 07 May 2025 01:22 PM (IST)

    భారత్‌ దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్‌

    – భారత్‌ దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్‌ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది

    – పాకిస్థాన్ మరోసారి తన దుర్బుద్ధిని చూపించింది. – సామాన్య పౌరులను టార్గెట్ చేసుకుని మోర్టార్లు ప్రయోగించిన పాక్ కుప్వారా, రాజౌరి, పూంచ్, యూరీ సెక్టార్లలో కాల్పులు జరిపింది. పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పులు, ఫిరంగి దాడుల్లో 10 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

    – పాక్ దుశ్చర్యకు తగిన రీతిలో బదులిస్తుంది ఆర్మీ..

  • 07 May 2025 01:13 PM (IST)

    ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రత్యేక సమీక్ష

    — హైదరాబాద్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ అత్యవసర సమావేశం

    — ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రత్యేక సమీక్ష

    — హాజరైన డీజీపీ జితేందర్,హోమ్ సెక్రటరీ రవి గుప్తా

    — ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సహా సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు

  • 07 May 2025 01:13 PM (IST)

    ప్రధాని మోదీ నేతృత్వంలో ధీటుగా బదులిచ్చాం -పవన్

    ఆపరేషన్‌ సింధూర్‌ ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. భారత్‌పై ఎవరు దాడి చేసినా సహించేదిలేదు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మోదీకి మద్దతుగా నిలవాలన్నారు. దేశ భద్రత విషయంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఈ అంశంలో కాంగ్రెస్ నేతలు తరచూ మాటలు మారుస్తున్నారని పవన్ ఆరోపించారు.

  • 07 May 2025 01:12 PM (IST)

    రాష్ట్రపతి ముర్ముతో భేటీకానున్న ప్రధాని మోదీ

    — ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మోదీ కీలక సమావేశం

    — రాష్ట్రపతి ముర్ముతో భేటీకానున్న ప్రధాని మోదీ

    — రాష్ట్రపతి నిలయానికి బయల్దేరిన పీఎం

    — ఆపరేషన్ సింధూర్‌పై ముర్ముకి వివరించనున్న మోదీ

  • 07 May 2025 12:37 PM (IST)

    ఆపరేషన్ సింధూర్‌ అప్ డేట్స్..

    LOCకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాదస్థావరం బర్నాల బింబర్‌ క్యాంప్‌. ఇది ఉగ్రవాదులకు ఆయుధాల ఉపయోగం, IEDల తయారీ, అడవుల్లో మనుగడ సాగించడం వంటి విషయాల్లో ఉగ్రమూకలకు ఇది శిక్షణ ఇచ్చే కేంద్రం. ఇది కూడా భారత్‌ జరిపిన ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైంది.

  • 07 May 2025 12:34 PM (IST)

    ఆపరేషన్ సింధూర్ అప్ డేట్స్..

    – భారత్‌ ఎటాక్‌తో పాకిస్తాన్‌ గడ్డపై ఉగ్రమూకలు ఛిన్నాభిన్నం

    – భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌పై మసూద్‌ అజహర్‌ తీవ్ర ఆక్రోశం

    – మూల్యం చెల్లించిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌

    – భారత సైన్యం దాడిలో మసూద్‌ అజహర్‌ కుటుంబంలో పదిమంది మృతి

    – సర్వనాశనమైన మసూద్‌ అజహర్‌ కుటుంబం

    – జైషే మహ్మద్‌ చీఫ్‌ సన్నిహితులు నలుగురు మృతి

    – మృతులంతా స్వర్గానికి వెళ్తారన్న మసూద్‌ అజహర్‌

    – భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మసూద్‌ బీరాలు

    – పాపిచిరాయువులా ఇంకా బతికే ఉన్న మసూద్‌ అజహర్‌

    – మసూద్‌ అజహర్‌ తప్ప కుటుంబమంతా మటాష్‌

    – చింతచచ్చినా పులుపు చావని జైషే మహ్మద్‌ చీఫ్‌

  • 07 May 2025 12:10 PM (IST)

    ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు

    ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు తెలిపింది. ఆపరేషన్ సింధూర్‌ను సమర్థిస్తూ ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది. ఉగ్రవాదంపై భారత సైనిక చర్యలు సరైనవేనంటూ సమర్థించింది. ఆత్మరక్షణ కోసం భారత్‌కు దాడి చేసే హక్కు ఉందన్నారు ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజర్

  • 07 May 2025 12:02 PM (IST)

    బర్నాల బింబర్‌ క్యాంప్‌ ధ్వంసం..

    LOCకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాదస్థావరం బర్నాల బింబర్‌ క్యాంప్‌. ఇది ఉగ్రవాదులకు ఆయుధాల ఉపయోగం, IEDల తయారీ, అడవుల్లో మనుగడ సాగించడం వంటి విషయాల్లో ఉగ్రమూకలకు ఇది శిక్షణ ఇచ్చే కేంద్రం. ఇది కూడా భారత్‌ జరిపిన ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసమైంది.

  • 07 May 2025 11:53 AM (IST)

    కాళ్లబేరానికి వచ్చిన పాక్‌ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్‌

    భారత్ మెరుపు దాడితో కాళ్లబేరానికి వచ్చారు పాక్‌ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్‌. భారత్‌ దాడులు ఆపేస్తే మేం ప్రతీకారానికి దిగమని పాక్‌ రక్షణమంత్రి ప్రకటించారు. లాహోర్‌, సియాల్‌కోట్‌ విమానాశ్రయాలను మూసివేసిన సంగతి తెలిసిందే.

  • 07 May 2025 11:37 AM (IST)

    మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతం

    భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. పాకిస్తాన్ మీడియా కథనం ప్రకారం, భారతదేశం మసూద్ అజార్ ఇంటిపై దాడి చేసిందని, ఇందులో 14 మంది మరణించారని తెలుస్తోంది. అయితే, ఈ దాడిలో మసూద్ అజార్ చనిపోయాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.

  • 07 May 2025 11:37 AM (IST)

    పాక్‌ నుంచి తుపాకుల మోత ఆగాలి – ఒమర్‌ అబ్దుల్లా

    పాక్‌పై భారత్ జరిపిన దాడిలో ఎక్కడా పౌర, సైనిక స్థావరాలకు నష్టం వాటిల్లలేదని జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. పహల్గామ్‌ దాడి జరిగి ఉండకపోతే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.

  • 07 May 2025 11:30 AM (IST)

    రాజ్‌నాథ్‌ను కలిసిన CDS అనిల్‌చౌహాన్

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను CDS అనిల్‌చౌహాన్ కలిశారు. దాడులపై పూర్తి వివరాలు అందించారు. కాసేపట్లో ఈ వివరాలతో ప్రధాని మోదీని రాజ్‌నాథ్‌సింగ్‌ కలవనున్నారు. ఆపరేషన్ సింధూర్‌పై ప్రధానికి రాజ్‌నాథ్‌సింగ్ వివరించనున్నారు.

  • 07 May 2025 11:26 AM (IST)

    పూంచ్ సెక్టార్‌లో పాకిస్థాన్ మరోసారి దుర్బుద్ధి

    జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో పాకిస్థాన్ మరోసారి తన దుర్బుద్ధిని చూపించింది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా, అడ్డగోలుగా జరిపిన కాల్పులు, ఫిరంగి దాడుల్లో 10 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మంది వరకు గాయపడ్డారని భారత సైన్యం వెల్లడించింది. పాక్ దుశ్చర్యకు తగిన రీతిలో బదులిస్తుంది ఆర్మీ.

  • 07 May 2025 11:19 AM (IST)

    25 నిమిషాల్లో 21 లక్ష్యాలపై భారత్ దాడి..

    ఆపరేషన్ గురించి పూర్తి సమాచారం అందించామని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. పాకిస్తాన్ పై తెల్లవారుజామున 1:05 గంటలకు దాడి జరిగిందని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్‌లో 9 చోట్ల దాడి జరిగింది. ఈ ఆపరేషన్ అర్థరాత్రి 1.05 నుంచి 1.30 వరకు కొనసాగింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా లక్ష్యంపై దాడి జరిగింది. ఉగ్రవాద దాడి కుట్రదారులపై దాడి జరిగింది. పాకిస్తాన్, పీఓకే రెండింటిపైనా దాడులు జరిగాయి. మేం పౌరులకు హాని చేయలేదు. ముందుగా, సవాయి నాలా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. మేం జైషే, లష్కర్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాం. 9 చోట్ల 21 లక్ష్యాలపై దాడి జరిగింది. పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో దాడి జరిగింది. ఇక్కడి సర్జల్ శిబిరంపై దాడి జరిగింది, ఇక్కడే ఒక హిజ్బుల్ శిబిరం ఉండేది.

  • 07 May 2025 11:17 AM (IST)

    పాకిస్తాన్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారింది – MEA

    పహల్గామ్ ఉగ్రవాద దాడి అనాగరికమైనదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. కుటుంబం ముందే ఉగ్రవాదులు వారిని కాల్చి చంపారు. దాడి చేసిన TRF కి లష్కర్ తో సంబంధం ఉంది. దాడి తర్వాత, వారిని సమాచారం ఇవ్వమని అడిగాం. పాకిస్తాన్ ఉగ్రవాదులతో వారికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించుకుంది. పాకిస్తాన్ ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తోంది. ఉగ్రవాదుల గురించి అబద్ధాలు చెబుతోంది.

  • 07 May 2025 11:15 AM (IST)

    అర్థరాత్రి నుంచి అసలేం జరిగిందంటే..

    11. ఆపరేషన్ సింధూర్‌పై పహల్గామ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నిర్ణయం, సైనికులు సాహసానికి గర్విస్తున్నామన్నారు. ఉగ్రవాదం పూర్తిగా తుడిచి పెట్టుకోవాలంటున్నారు పహల్గాం బాధితులు. సైనికులకి ఆల్ ది బెస్ట్.. ఉగ్రవాదంపై విజయం సాధించాలంటున్నారు పహల్గాం బాధితులు.

    12. భారత్‌ ప్రతీకార దాడులతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు భారతీయులు. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పారంటూ నినాదాలు చేస్తున్నారు. టపాసులు, బాణాసంచా కాల్చుతూ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు ఇండియన్స్‌ .

    13. ఆపరేషన్‌ సింధూర్‌పై మిత్ర దేశాలకు భారత్‌ సమాచారం ఇచ్చింది. అమెరికా, యూకే, రష్యా, సౌదీ, యూఏఈ సహా.. పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడారు ఉన్నతాధికారులు. టెర్రర్‌ క్యాంప్‌లపై దాడికి కారణాల్ని వివరించింది భారత్. ‌

    14. పాక్‌పై దాడుల తర్వాత జరిగిన పరిణామాలతో కశ్మీర్‌లోని మూడు జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేశారు అధికారులు. బారాముల్లా, కుప్వారా, గురేజ్‌లో విద్యాసంస్థలు బంద్ చేశారు.

    15. ఉగ్రమూకల పీచమణిచేలా భారత్‌ ఆర్మీ 9 చోట్ల జరిపిన మెరుపు దాడుల్లో 100 మంది టెర్రరిస్ట్‌లు హతం అయ్యారు. జైషేకి చెందిన బహావల్‌పూర్‌లోనే 30 మంది.. మురిడ్కేలోనూ 30 మంది టెర్రరిస్టులు ఖతం అయ్యారు.

    16. ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడులతో పాకిస్తాన్‌లో వణుకుపుడుతోంది. పాక్‌కు వెళ్లే పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. పాకిస్తాన్‌కు ఖతార్ నుంచి వెళ్లే విమాన సర్వీసులు రద్దయ్యాయి.

    17. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు తెలిపింది. ఆపరేషన్ సింధూర్‌ను సమర్థిస్తూ ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది. ఉగ్రవాదంపై భారత సైనిక చర్యలు సరైనవేనంటూ సమర్థించింది. ఆత్మరక్షణ కోసం భారత్‌కు దాడి చేసే హక్కు ఉందన్నారు ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజర్

    18. భారత్‌ ఆపరేషన్‌పై ఎప్పటికప్పుడు క్లోజ్‌గా మానిటర్‌ చేస్తున్నామన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. భారత్ యాక్షన్‌కి కౌంటర్‌గా పాక్‌ ఎటువంటి చర్య తీసుకోవద్దు.. భారత్‌పై యుద్ధానికి పాక్ ధైర్యం చెయ్యొద్దన్నారు. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్‌కి ఉంది.. ఆపరేషన్ సింధూర్‌పై పాక్‌ మౌనంగా ఉంటే మంచిదని సూచించారు.

    19. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో.. సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష చేయనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష చేస్తారు. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టికి ఫోన్ చేసిన రేవంత్ తక్షణమే హైదరాబాద్ బయల్దేరి రావాలని సూచించారు. మాక్ డ్రిల్‌ను స్వయంగా పర్యవేక్షించనున్నారు రేవంత్.

    20. ఉగ్రవాదాన్ని ప్రపంచం ఉపేక్షించకూడదంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేయాగా.. పాకిస్తాన్‌కు కఠినమైన గుణపాఠం చెప్తూ .. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలంటూ ఆసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్‌ కి సపోర్ట్ చేస్తూ జైహింద్‌ అంటూ పలువురు ప్రముఖులు ఎక్స్ లో పోస్ట్ చేశారు.

  • 07 May 2025 11:09 AM (IST)

    జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉగ్రదాడి

    ఆపరేషన్ సింధూర్‌పై మీడియా సమావేశంలో మాట్లాడిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌..  పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని ఇంటెలిజెన్స్‌ గుర్తించిందని, జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉగ్రదాడి జరగిందని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఆరంభం మాత్రమేనని, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించామని వారు తెలిపారు.

  • 07 May 2025 11:05 AM (IST)

    ఆపరేషన్ సింధూర్‌తో రాత్రి నుంచి అసలేం జరిగిందంటే..

    1.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. బిహార్‌లో ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగానే వారి స్థావరాల్లో వారికి సమాధి కట్టేశారు. ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

    2. చెప్పి మరీ ఎటాక్ చేసిన భారత సైన్యం. దాడులకు కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ ట్వీట్‌ చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట 28 నిమిషాలకు దాడికి సిద్ధం.. గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్‌ చేసింది. ఒంటి గంట 51 నిమిసాలకు ఆపరేషన్‌ ముగిసాక న్యాయం జరిగింది.. జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్‌ చేసింది.

    3. ఆపరేషన్ సింధూర్‌ని స్వయంగా పర్యవేక్షించారు భారత ప్రధాని మోదీ. వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించారు. కాసేపట్లో CCS కీలక భేటీ జరగనుంది. ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత నుంచి 3 సార్లు CCS మీటింగ్ జరిగింది.సీసీఎస్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది.

    4. ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష చేశారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రధానితో భేటీ కానున్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌. ఉగ్ర స్థావరాలు నేలమట్టం కాగానే ‘జైహింద్’ అంటూ రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు.

    5. ఆపరేషన్‌ సింధూర్‌లో కీలక ఉగ్రనేతలు హతమయ్యారు. లష్కరే తోయిబా నేత హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌ హతం కాగా.. మరో ఉగ్ర నేత ముదాసిర్‌ మృతి చెందాడు.

    6. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ చెక్‌పోస్టులు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్‌ సైన్యం కాల్పుల్లో 10 మంది పౌరులు మృతి చెందారు. భారత్‌ ఆర్మీని ఎదురుకోలేక సామన్య ప్రజలపై కాల్పులు జరుపుతోంది పాక్‌ సైన్యం. కశ్మీర్‌ సహా ఎల్‌వోసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతోంది.

    7. యూరీ, కుప్వారా, రాజౌరి-పూంచ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది. పాక్‌ సైన్యం కాల్పులను తిప్పికొడుతోంది భారత బలగాలు. భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు. కాల్పుల్లో పలువురు సైనికులకు కూడా గాయాలు

    8. భారత్ మెరుపు దాడితో కాళ్లబేరానికి వచ్చారు పాక్‌ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్‌. భారత్‌ దాడులు ఆపేస్తే మేం ప్రతీకారానికి దిగమని పాక్‌ రక్షణమంత్రి ప్రకటించారు. లాహోర్‌, సియాల్‌కోట్‌ విమానాశ్రయాలను మూసివేశారు.

    9. ఆపరేషన్‌ సింధూర్‌పై అమిత్‌షా స్పందించారు. పహల్గామ్‌ దాడికి ప్రతిస్పందనే ఆపరేషన్‌ సింధూర్‌ అంటూ కేంద్ర హోంమంత్రి పోస్ట్‌ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు అమిత్‌షా

    10. ఆర్మీ ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్‌ సింధూర్‌పై ఆర్మీ అధికారులు వివరాలు వెల్లడించారు. భద్రతాదళాల ప్రతినిధులు, రక్షణ మంత్రిని కలిసి దాడి వివరాలు తెలిపారు CDS.

  • 07 May 2025 10:55 AM (IST)

    పారా మిలిటరీ బలగాల సెలవులు రద్దు: అమిత్‌ షా

    ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో పారా మిలిటరీ బలగాల సెలవులు రద్దు చేయాలని,  సెలవులో ఉన్న వారిని వెనక్కి రప్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.

  • 07 May 2025 10:53 AM (IST)

    ఆపరేషన్ సింధూర్‌పై విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశం

  • 07 May 2025 10:42 AM (IST)

    ఆపరేషన్‌ సింధూర్‌లో కీలక ఉగ్రనేతల హతం

    — మురిడ్కేలోని మర్కజ్‌ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు — లష్కరే తోయిబా నేత హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌ హతం — మాలిక్‌తో పాటు మరో ఉగ్ర నేత ముదాసిర్‌ మృతి.

  • 07 May 2025 10:39 AM (IST)

    ఆపరేషన్ సింధూర్‌పై మీడియా సమావేశం

    -దాడి వివరాలు వెల్లడించనున్న విదేశాంగ కార్యదర్శి -మీడియా సమావేశంలో పాల్గొననున్న భద్రతాదళాల ప్రతినిధులు -రక్షణ మంత్రిని కలిసి దాడి వివరాలు తెలిపిన CDS -ప్రధానితో భేటీ కానున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

    – విక్రమ్ మిస్త్రీ, విదేశాంగ శాఖ కార్యదర్శి – కల్నల్ సోఫియా ఖురేషి, ఆర్మీ – వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఎయిర్‌ఫోర్స్ – ఈ ముగ్గుర ఉన్నతాధికారులు కాసేపట్లో ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించనున్నారు – ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ నుంచి మీడియా ముందుకు మహిళా అధికారిణులు

  • 07 May 2025 09:15 AM (IST)

    ఆపరేషన్ సింధూర్ అప్‌డేట్స్..

    – ఉగ్రమూకల పీచమణిచేలా భారత్‌ ఆర్మీ మెరుపు దాడులు

    – 9 చోట్ల క్షిపణిదాడుల్లో 100 మంది టెర్రరిస్ట్‌ల హతం

    – జైషేకి చెందిన బహావల్‌పూర్‌లోనే 30 మంది ఖతం

    – మురిడ్కేలోనూ 30 మంది టెర్రరిస్టులు డెడ్‌

    – లష్కరే, జైష్‌-ఎ-మహ్మద్ హెడ్‌క్వార్టర్స్‌పై విరుచుకుపడ్డ సైన్యం

    – పాక్‌ రాడార్‌కి దొరక్కుండా టార్గెట్ రీచ్ అయిన మిసైళ్లు

    – పాక్‌ ఆర్మీపై కాదు.. కేవలం టెర్ర్‌ క్యాంప్‌లపైనే దాడులు

    – పాక్‌లోను, POKలోనూ టార్గెట్‌లను ధ్వంసం చేసిన ఆర్మీ

    – సామాన్య పౌరుల నివాసాలు ఉన్నచోట టెర్రర్‌ క్యాంప్‌లు

    – పౌరులకు ఇబ్బంది లేకుండా కేవలం ఉగ్రశిబారాలు నేలమట్టం

    – కచ్చితంగా టార్గెట్‌లను పేల్చేసిన భారత్‌ మిస్సైళ్లు

    – అర్ధరాత్రి 1:28 గంటలకు మొదలైన ‘ఆపరేషన్‌ సింధూర్‌’

    – 1:51కి ఆపరేషన్‌ ముగిసాక ఆర్మీ ట్వీట్‌

    – న్యాయం జరిగింది.. జై హింద్ అంటూ ఆర్మీ ట్వీట్‌

    – 10 గంటలకు ‘ఆపరేషన్‌ సింధూర్’‌పై రక్షణశాఖ ప్రెస్‌మీట్‌

  • 07 May 2025 09:15 AM (IST)

    ఆపరేషన్ సింధూర్ అప్ డేట్స్..

    — ఉగ్రస్థావరాలే టార్గెట్‌గా ఇండియన్‌ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయ్‌

    — పాకిస్తాన్‌లో 4.. పీవోకేలో 5 చోట్ల ఎటాక్స్‌ కొనసాగుతున్నాయ్‌

    — ఇండియన్‌ ఆర్మీ ఎక్కడెక్కడ దాడి చేసిందో ఒకసారి చూద్దాం

    — మురిడ్కే.. ఇక్కడే లష్కరే తోయిబా హెడ్‌ క్వార్టర్‌ ఉంది.. దాంతో, మిస్సైళ్లతో విరుచుకుపడింది భారత్‌

    — బహావల్‌పూర్‌.. ఇక్కడ జైష్-ఎ-మహమ్మద్ హెడ్‌ క్వార్టర్‌ ఉంది.. ఈ ప్రాంతంపై కూడా బాంబుల వర్షం కురిపించింది ఇండియన్‌ ఆర్మీ

    — ముజఫరాబాద్.. పీవోకేకి హెడ్‌క్వార్టర్‌ ఇది.. ఇక్కడే హిజ్బుల్ ముజాహిదీన్‌ బెస్‌ ఉంది.. ముజఫరాబాద్‌లో రెండు ప్రాంతాలను టార్గెట్‌ చేసింది భారత్‌

    — కోట్లీ.. ఇక్కడున్న టెర్రర్‌ క్యాంప్స్‌పై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్‌ ఆర్మీ

    — ముజఫరాబాద్‌లో మరోచోట మిస్సైళ్లతో దాడి చేసింది భారత్‌

    — గుల్‌పూర్… ఇక్కడున్న టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌పై దాడులు చేసింది భారత్‌

    — సియాల్‌కోట్‌.. ఇక్కడ టెర్రర్‌ క్యాంప్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించింది

    — చాక్‌అమ్రూ.. ఇక్కడ టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌పై భారత సైన్యం దాడులు చేసింది

    — భీంబర్‌.. ఇక్కడ కూడా టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌పై దాడులు చేసింది ఇండియన్‌ ఆర్మీ

  • 07 May 2025 09:00 AM (IST)

    ఆపరేషన్ సిందూర్

    – ఆపరేషన్ సిందూర్” పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

    – ఒక రాత్రిలోనే మూడు టెర్రర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నేలమట్టం చేసింది

    – 26/11 దాడులకు ప్రతీకారంగా మురిడ్కేలో దాడులు చేసిన ఆర్మీ

    – పుల్వామా ఎటాక్‌కి ప్రతీకారంగా బహావల్‌పూర్‌లో మెరుపు దాడులు

    – J&Kలో జరిగిన పెద్ద దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్ సియాల్కోట్‌పై ఎయిర్‌ స్ట్రైక్‌

    – ఒక దెబ్బకు మూడు పిట్టలు అనేలా.. రాత్రిరాత్రికే మూడు టెర్రర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నేలమట్టం చేసింది ఇండియన్‌ ఆర్మీ..

    – పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది.

    దాడిలో సుమారు 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి.

  • 07 May 2025 08:36 AM (IST)

    ఆపరేషన్ సింధూర్ అప్‌డేట్స్..

    — మర్కజ్ సుభాన్ అల్లా పేరుతో పిలవబడే జైష్‌ ఎ మొహమ్మద్‌ ప్రధాన స్థావరం పాకిస్తా్‌న్‌లోని పంజాబ్‌ జిల్లా బహవల్పూర్‌లో ఉంది. 2019 పుల్వామా ఉగ్రదాకి పాల్పడిన నిందితులకు ఈ శిబిరంలోనే శిక్షణ ఇచ్చారు.

    — మర్కజ్ జైష్‌ ఎ మొహమ్మద్‌ స్థావరంలో జైషే మమ్మద్ చీఫ్‌ మౌలానా మసూద్ అజర్, జైష్‌ ఎ మహ్మద్ అధిపతి ముఫ్తీ అబ్దుల్ రవూఫ్‌ అస్గర్, మౌలానా అమ్మర్ కుటుంబసభ్యుల నివాసాలు కూడా ఉన్నాయి. వీరితో పాటు 600 మందికి పైగా జైష్‌ ఎ మహ్మద్ సభ్యులు ఉంటున్నారు.

    — యూకే సహా కొన్ని గల్ఫ్‌, ఆఫ్రికన్ దేశాల నుంచి సేకరించిన నిధులతో పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ జైష్‌ ఎ మమ్మద్‌ స్థావరం మర్కజ్ సుభాన్ అల్లా నిర్మాణం చేపట్టింది. ఇక్కడ 2018 జులై నుంచి జైష్‌ ఎ మహ్మద్‌ సభ్యులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

  • 07 May 2025 08:05 AM (IST)

    జైష్-ఎ-మొహమ్మద్ కీలక కేంద్రం నేలమట్టం

    – పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఉంది ఈ హెడ్‌క్వార్టర్‌. -15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం ఉంటుంది. – 2019 పుల్వామా దాడికి ఉగ్రవాదులు శిక్షణ పొందింది ఇక్కడే. – మసూద్ అజార్ ఆధీనంలోని ఈ టెర్రర్‌ క్యాంప్‌ను గురిపెట్టి ధ్వంసం చేసింది మన ఆర్మీ. – జైష్ చీఫ్ మౌలానా మసూద్ అజార్, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్‌తో కలిసి ఈ శిబిరం నుండి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

  • 07 May 2025 08:05 AM (IST)

    పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

    – మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే టార్గెట్‌గా మిస్సైల్‌ దాడులు – బహావల్‌పూర్‌పై మొదటి దాడి చేసిన భారత్ సైన్యం – బహావల్‌పూర్‌లోనే 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ – బహావల్‌పూర్‌లోని మసూద్‌ అజర్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై దాడి – మసూద్‌ అజార్‌కి సంబంధించిన మదర్సాపై 4 క్షిపణుల దాడి – లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపైనా భారత్‌ దాడులు – భారత్‌ మిస్సైల్‌ దాడులతో బెంబేలెత్తిన పాకిస్తాన్‌ – భారత్‌ 6 చోట్ల దాడి చేసి 24 క్షిపణులను ప్రయోగించిందన్న పాక్‌ – దాడుల్లో 8 మంది మృతి 33 మందికి గాయాలు- పాక్‌ ఆర్మీ అధికారి

  • 07 May 2025 07:44 AM (IST)

    ముగ్గురు భారత పౌరుల దుర్మరణం

    భారత్‌ మెరుపుదాడితో రగిలిపోయి బోర్డర్‌లో పాక్‌ కాల్పులకు దిగింది. సరిహద్దు గ్రామాలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిగింది. పాక్‌ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరుల దుర్మరణం చెందారు. మన జవాన్ల కాల్పుల్లో పలువురు పాక్‌ రేంజర్లు హతమయ్యారు. తమవైపు జరిగిన నష్టాన్ని బయటకు చెప్పుకోని పాకిస్తాన్‌.

  • 07 May 2025 07:41 AM (IST)

    పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ

    ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్ అప్రమత్తమైంది. దీంతో ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది.  ఈమేరకు అన్ని ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టులను పాకిస్తాన్ క్లోజ్‌ చేసింది. అలాగే, స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది పాక్ సర్కార్.

  • 07 May 2025 07:21 AM (IST)

    వాళ్లకు న్యాయం చేయడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం

    పహల్గామ్ ఉగ్రదాడిలో కళ్లముందే భర్తలను కోల్పోయిన భార్యలకు చేసే న్యాయమే ఆపరేషన్ సింధూర్. కేంద్రం ఆ అర్థంలోనే ఈ ఆపరేషన్‌కు ఆ పేరు ఖరారు చేసింది. అదీగాక కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి గాంచిన కశ్మీర్‌ లోయలో పహల్గామ్‌ ఉగ్రదాడులతో పాకిస్తాన్‌ రక్తం పారించింది. పాక్‌ ఉగ్రదాడికి జవాబుగా ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది భారత సైన్యం.

  • 07 May 2025 07:20 AM (IST)

    ఆపరేషన్ సింధూర్ అంటే..

    ఆపరేషన్ సింధూర్‌. ఎందుకీ పేరు? పహల్గామ్‌దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి, ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సింధూర్‌’ అని నామకరణం చేశారు.

  • 07 May 2025 07:14 AM (IST)

    4 జైషే స్థావరాలు ధ్వంసం

    భారత్‌ దాడిలో 4 జైషే స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఇందులో మూడు లష్కరే స్థావరాలు ఉన్నాయి. LOC దగ్గర పలువురు పాక్‌ ఆర్మీ సైనికులు హతమైనట్లు తెలుస్తోంది. మొదట కాల్పులు మొదలుపెట్టింది పాక్‌ సైన్యమేనని భారత్ ప్రకటించింది. దీంతో భారత్‌ ప్రతి దాడుల్లో పాక్‌ సైనికులు హతమైనట్లు పేర్కొంది.

  • 07 May 2025 07:12 AM (IST)

    వైమానిక ప్రాంతాన్ని మూసివేసిన పాక్

    భారత దాడి తర్వాత పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితి నెలకొంది. దీంతో 48 గంటల పాటు తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది.

  • 07 May 2025 06:58 AM (IST)

    అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన..

    అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22న కాశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పౌరులు మరణించారని పేర్కొంది. ఈ దాడిలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల ప్రమేయం ఉందని సూచించే విశ్వసనీయమైన, సాంకేతిక సమాచారం, ప్రాణాలతో బయటపడిన వారి సాక్ష్యాలు, ఇతర ఆధారాలు భారతదేశం వద్ద ఉన్నాయని తెలిపింది.

    ఉగ్రవాదులపై, వారికి మద్దతు ఇస్తున్న మౌలిక సదుపాయాలపై పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. బదులుగా, పాకిస్తాన్ తిరస్కరించడంతోపాటు భారతదేశంపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని, పాకిస్తానీ పౌర, ఆర్థిక లేదా సైనిక స్థావరాలను టార్గెట్ చేయలేదని తెలిపింది. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. దాడులు జరిగిన వెంటనే, NSA అజిత్ దోవల్ US NSA, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడి తీసుకున్న చర్యల గురించి వివరించారు.

  • 07 May 2025 06:56 AM (IST)

    జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం ధ్వంసం

    ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా, పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లోని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించిన బహవల్పూర్ ఇదే. పాకిస్తాన్ ఐదు ప్రదేశాలపై దాడి చేసినట్లు అంగీకరించింది. వీటిలో మూడు పీఓకేలో, రెండు పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జరిగాయి. భారత దాడిలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం కూడా ధ్వంసమైంది.

  • 07 May 2025 06:29 AM (IST)

    ఆపరేషన్ సింధూర్‌‌పై ట్రంప్ ప్రకటన..

    భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉందని, ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు ట్రంప్ సూచించారు. ఇరు దేశాలు దశాబ్దాలుగా గొడవ పడుతున్నారు, దీనికి త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు అని తెలిపారు.

  • 07 May 2025 06:25 AM (IST)

    ‘ఆపరేషన్ సిందూర్’ పై భారత్ కీలక ప్రకటన

    భారత హోం మంత్రిత్వ శాఖ ‘ఆపరేషన్ సింధూర్’ పై ప్రకటనలో మొత్తం 9 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మా చర్యలు కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, లక్ష్యాలను ఎంచుకోవడంలో భారతదేశం చాలా సంయమనం పాటించిందని ప్రకటించింది. పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ జాతీయుడు మరణించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

  • 07 May 2025 06:23 AM (IST)

    ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత చర్య..

    ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టినట్లు భారత్ ప్రకటించింది. ప్రపంచ దేశాలకు ఈ మేరకు సందేశం పంపినట్లు తెలిపింది. భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేశాయి

  • 07 May 2025 06:19 AM (IST)

    భారతదేశ ఆపరేషన్‌పై పాకిస్తాన్ ప్రకటన

    పాకిస్తాన్ డాన్ న్యూస్ నివేదిక ప్రకారం, కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారతదేశం కోట్లి, బహవల్‌పూర్, ముజఫరాబాద్‌లలో క్షిపణి దాడులు నిర్వహించిందని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు.

Published On - May 07,2025 6:17 AM

Follow us