AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ తర్వాత పిల్లల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. సర్వేలో షాకింగ్‌ నిజాలు..!

మొదట్లో 5 లేదా 10 రోజులు యాంటీబయాటిక్స్ ఇచ్చాం. ఇప్పుడు అది ఎక్కువ కాలం వాడాల్సి వస్తుందన్నారు. ఎందుకంటే ప్రస్తుతం పిల్లల్లో వచ్చే జలుబు, దగ్గురు ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ కాబట్టి అంటున్నారు డాక్టర్లు. కోవిడ్ కాలంలో దాదాపు 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్న పిల్లలు ఇప్పుడు పూర్తిగా పాఠశాలకు వెళ్తున్నారని, వారిలో ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదే కావచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు.

కోవిడ్ తర్వాత పిల్లల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. సర్వేలో షాకింగ్‌ నిజాలు..!
Children
Jyothi Gadda
|

Updated on: Oct 10, 2023 | 7:32 AM

Share

కోవిడ్ తర్వాత దేశంలోని చిన్నారుల్లో జ్వరం, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగాయి. కోవిడ్‌కి ముందు పిల్లలకు ఏడాదికి 2-3 సార్లు జ్వరం, జలుబు, దగ్గు వచ్చేవి. ఇప్పుడు అది నాలుగు రెట్లు ఎక్కువైంది. అంతే కాదు ఇప్పుడు పిల్లలకు జ్వరం, జలుబు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వస్తే అవి తగ్గేందుకు చాలా సమయం పడుతుందని ఓ అధ్యయనం తెలిపింది. సోషల్ మీడియాలో సర్వే సంస్థ లోకల్ సర్కిల్ ద్వారా దేశవ్యాప్తంగా 317 జిల్లాలకు చెందిన 31,000 మంది తల్లిదండ్రుల నుండి సేకరించిన సమాచారంలో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలకు వెళ్లే పిల్లలు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారు. దేశంలో వివిధ రకాల ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి కారణం కోవిడ్ కావచ్చు. అవి పిల్లల నుంచి తల్లిదండ్రులకు కూడా విస్తరిస్తున్నాయని సర్వేలో వెల్లడైంది.

సర్వేలో పాల్గొన్న వారిలో 30శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు గత 12 నెలల్లో 4 నుంచి 6 సార్లు జ్వరం, జలుబు మరియు దగ్గు వచ్చినట్లు చెప్పారు. 7 నుంచి 12 సార్లు వచ్చినట్లు మూడు శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. 38శాతం మంది తల్లిదండ్రులు 2 నుంచి 3 సార్లు వచ్చినట్లు చెప్పారు.

వైద్యులు కూడా దీనిని నిర్ధారించారు. ‘కోవిడ్ తర్వాత పిల్లలలో జ్వరం, జలుబు మరియు దగ్గు సంభవించడం ఖచ్చితంగా పెరిగింది. అదనంగా, ఇప్పుడు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మొదట్లో 5 లేదా 10 రోజులు యాంటీబయాటిక్స్ ఇచ్చాం. ఇప్పుడు అది ఎక్కువ కాలం వాడాల్సి వస్తుందన్నారు. ఎందుకంటే ప్రస్తుతం పిల్లల్లో వచ్చే జలుబు, దగ్గురు ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ కాబట్టి అంటున్నారు డాక్టర్లు. కోవిడ్ కాలంలో దాదాపు 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్న పిల్లలు ఇప్పుడు పూర్తిగా పాఠశాలకు వెళ్తున్నారని, వారిలో ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదే కావచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us