AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మురుగు నీటిలో వారం పాటు వైరస్‌..మూడోదశపై 3వారాల్లో క్లారిటీ! ఐఐసీటీ స్టడిలో సంచలనాలు

కరోనా సేకండ్‌వేవ్‌ ప్రజలను కకావికలం చేస్తోంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీని నుంచి బతికి బట్టకట్టడమే కర్తవ్యంగా...

మురుగు నీటిలో వారం పాటు వైరస్‌..మూడోదశపై 3వారాల్లో క్లారిటీ! ఐఐసీటీ స్టడిలో సంచలనాలు
Iitc
Anil kumar poka
|

Updated on: May 02, 2021 | 10:03 AM

Share

కరోనా సేకండ్‌వేవ్‌ ప్రజలను కకావికలం చేస్తోంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీని నుంచి బతికి బట్టకట్టడమే కర్తవ్యంగా పోరాడుతున్నారు దేశ ప్రజలు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. కరోనా సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్‌ బహిర్గతవుతుందని, మురుగునీటిలో కరోనా వైరస్‌ ఏడు రోజుల పాటు బతికుంటుందని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) హైదరాబాద్‌ సైటిస్టుల పరిశోధనలో వెల్లడైంది.

ఏడాది కాలంగా మురుగు నీళ్లు కలుస్తున్న చెరువులు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లలోని శాంపిళ్లను సేకరించి సైంటిస్టులు స్టడీ చేశారు. వైరస్‌ మనుగడ, దాని జీన్స్‌లో జరిగే మార్పులు వైరస్‌ వ్యాపించే తీవ్రత వంటి వాటిని పరిశీలించారు. వాటి ఆధారంగా కరోనా సెకండ్‌వేవ్‌తో పాటు థర్డ్‌వేవ్‌పైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టడీలో భాగంగా 1.8లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాల్లోని చెరువుల నుంచి శాంపిళ్లను సైంటిస్టులు సేకరించారు. తార్నాక, లాలాగూడ, హెచ్‌ఎంటీ నగర్‌, నాచారం, రాఘవేంద్రనగర్ లలోని మురుగు నీటిని చెరువుల దగ్గర ఉన్న ఎస్టీపీ ఇన్‌లెట్‌, అవుట్‌ లెట్ల నుంచి నమూనాలను తీసుకున్నారు. ఒక్కో లీటర్‌ మురుగు నీటిలో 45,456 కరోనా జీన్స్‌ ఉన్నట్లు గుర్తించారు.

ఎస్టీపీ ఔట్‌లెట్లలో వైరస్‌ జీన్స్‌ ఉన్నా మార్పులకు అవకాశం లేని స్థితిలో ఉందని తేల్చారు. మురుగు నీటిలో వైరస్‌ జీన్స్‌లో మార్పులు గత ఏడాది డిసెంబర్‌ నుంచే జరుగుతున్నాయని కన్ఫర్మ్ చేశారు. మరోమూడు వారాల్లో దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను ఇస్తామని స్టడీలో పాల్గొన్న ఐఐసీటీ సైంటిస్ట్‌లు చెప్పారు. దీని ద్వారా దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు.

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే