AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman Bharat Yojana: ఈ విధంగా చేస్తేనే.. మీరు ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలను పొందుతారు..!

ఆయుష్మాన్ భారత్ పథకం కింద, మీరు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఆసుపత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే మీరు దీనికి అర్హత కలిగి ఉండి, ఇంకా ఈ కార్డ్ కోసం పొందకుంటే, వెంటనే ఈ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోండి.

Ayushman Bharat Yojana: ఈ విధంగా చేస్తేనే.. మీరు ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలను పొందుతారు..!
Ayushman Bharat Yojana
Balaraju Goud
|

Updated on: Dec 17, 2023 | 1:39 PM

Share

భారత ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం అనేక ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పీఎం ఆవాస్‌ యోజనను ప్రారంభించింది. పేదలకు గ్యాస్ స్టవ్‌లు అందించేందుకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే, నరేంద్ర మోడీ ప్రభుత్వం, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి కోసం ఆయుష్మాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆయుష్మాన్ పథకం కింద, ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్లు ఎంప్యానెల్ చేయబడిన ఆసుపత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. మీరు కూడా ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్ అయితే, ఈ పథకం ప్రయోజనాలను ఎలా పొందాలో తెలుసుకోండి..

ఎవరు ప్రయోజనం పొందవచ్చు!

భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం భారతీయులందరికీ కాదు. ఇందుకోసం ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలను నిర్దేశించింది. ఈ పథకం కింద గిరిజనులు, ఎస్సీ, ఎస్టీలు, దానధర్మాలు లేదా భిక్షాటన చేసేవారు, కూలీలు, ఇళ్లు లేని వారు, దారిద్యరేఖకు దిగువన ఉన్న వారు మాత్రమే అర్హులుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరిన్ని వివరాల కోసం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు మీ అర్హతను తనిఖీ చేయవచ్చు.

మీరు ఇలాంటి ప్రయోజనాలను పొందవచ్చు!

ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలను పొందడానికి, ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ మీరు కొత్త రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తుపై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీరు పేరు, జెండర్, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ వంటి మీ సాధారణ సమాచారాన్ని పూరించాలి. సమాచారాన్ని నింపేటప్పుడు, మీరు సరైన సమాచారాన్ని పూరిస్తున్నారని గుర్తుంచుకోవాలి. ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే, మీ అర్హతను రద్దు చేయవచ్చు.

ఆ తర్వాత ఇందుకు సంబంధించిన మీ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మీరు మొత్తం దరఖాస్తు ఫారమ్‌ను పూరించిన తర్వాత, దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, మళ్లీ సమర్పించండి. మీ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, సంబంధిత అధికారి మీ దరఖాస్తును చూసి దాన్ని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత మీకు భారత్ యోజన ఆరోగ్య కార్డు జారీ చేయడం జరుగుతుంది.

ఏయే పత్రాలు అవసరం..?

ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలను పొందడానికి, మీకు ఈ పత్రాలు అవసరం. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, చెల్లుబాటు అయ్యే ఫోన్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో. ఈ పత్రాలన్నీ మీ వద్ద ఉండటం ముఖ్యం. అప్పుడే మీరు ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోగలరు.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద, మీరు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఆసుపత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే మీరు దీనికి అర్హత కలిగి ఉండి, ఇంకా ఈ కార్డ్ కోసం పొందకుంటే, వెంటనే ఈ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…