AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్ ఆఫర్… ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఇస్తే పాలప్యాకెట్ ఫ్రీ..

ప్లాస్టిక్‌ను వృథాగా చెత్తలో వేస్తే భూమి కలుషితం అవుతుంది. అంతేకాదు.. ఆ ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ వేస్తే.. వాటిని జంతువులు తింటూ అస్వస్థతకు గురవుతున్నాయి. అంతేకాదు.. వరదనీరులో కొట్టుకుపోయి సముద్ర జలాల్లో కలుస్తూ.. సముద్ర జీవులకు ప్రాణసంకటంగా మారుతుంది ఈ ప్లాస్టిక్. అయితే ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో హర్యానాలోని పంచకుల మున్సిపల్ కార్పోరేషన్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్‌ను ఎక్కడపడితే […]

బంపర్ ఆఫర్... ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఇస్తే పాలప్యాకెట్ ఫ్రీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 26, 2019 | 6:17 PM

Share

ప్లాస్టిక్‌ను వృథాగా చెత్తలో వేస్తే భూమి కలుషితం అవుతుంది. అంతేకాదు.. ఆ ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ వేస్తే.. వాటిని జంతువులు తింటూ అస్వస్థతకు గురవుతున్నాయి. అంతేకాదు.. వరదనీరులో కొట్టుకుపోయి సముద్ర జలాల్లో కలుస్తూ.. సముద్ర జీవులకు ప్రాణసంకటంగా మారుతుంది ఈ ప్లాస్టిక్. అయితే ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో హర్యానాలోని పంచకుల మున్సిపల్ కార్పోరేషన్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ప్రజల్లో ఆసక్తి నెలకొనేలా.. కొత్త ప్రయోగాలు చేస్తోంది. ప్లాస్టిక్ తీసుకురండి.. పాల ప్యాకిట్ ఫ్రీగా పొందండి అంటూ నినాదం చేస్తోంది. పంచకుల మున్సిపల్ పరిధిలో వీటి కోసం ప్రత్యేక బూత్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఒక కేజీ ప్లాస్టిక్ కవర్లను ఇస్తే.. ఒక పాలప్యాకెట్ ఫ్రీగా పొందవచ్చునని అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. 10 వాటర్ బాటిల్స్‌ ఇచ్చే వారికి కూడా ఒక పాలప్యాకెట్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఇలా చేయడం ద్వారా ప్లాస్టిక్‌ దుర్వినియోగం కాకుండా.. రీ సైక్లింగ్‌ కోసం ఉపయోగించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కార్పోరేషన్ పరిధిలో మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. పంచకుల కార్పోరేషన్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఈ బూత్‌లను ఏర్పాటు చేశామని.. ఇప్పటికే దాదాపు 5 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించామని మున్సిపల్ అధికారి తెలిపారు.