AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన జీవిత భాగస్వామిపై అంత ద్వేషమా? మహిళను 25 సార్లు పొడిచి చంపిన వ్యక్తి!

హర్యానాలో దారుణం వెలుగు చూసింది. పానిపట్‌లో సహజీవనం చేస్తున్న మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రిఫైనరీ రోడ్‌కు చెందిన నిందితుడి పోలీసులు అరెస్టు చేశారు. మహిళ గొంతు కోసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య చేసిన తర్వాత, నిందితుడు మహిళ మృతదేహాన్ని ఒక గదిలో బంధించి పారిపోయాడు. మహిళ ఛాతీ, కడుపు, మెడపై 25 కత్తిపోట్ల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

తన జీవిత భాగస్వామిపై అంత ద్వేషమా?  మహిళను 25 సార్లు పొడిచి చంపిన వ్యక్తి!
Panipat Crime
Balaraju Goud
|

Updated on: Jun 29, 2025 | 6:44 PM

Share

హర్యానాలో దారుణం వెలుగు చూసింది. పానిపట్‌లో సహజీవనం చేస్తున్న మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రిఫైనరీ రోడ్‌కు చెందిన నిందితుడి పోలీసులు అరెస్టు చేశారు. మహిళ గొంతు కోసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య చేసిన తర్వాత, నిందితుడు మహిళ మృతదేహాన్ని ఒక గదిలో బంధించి పారిపోయాడు. మహిళ ఛాతీ, కడుపు, మెడపై 25 కత్తిపోట్ల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

పానిపట్‌లోని గంగారామ్ కాలనీలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో నివసిస్తున్న ఒక మహిళను గురువారం(జూన్ 27) రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమె ప్రియుడు మహేంద్ర పాల్ కత్తితో పొడిచి చంపాడు. మృతురాలిని యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలోని కెలై గ్రామానికి చెందిన ఉష(40)గా గుర్తించారు. హత్య తర్వాత, నిందితుడు మృతదేహాన్ని గదిలో బంధించి పారిపోయాడు. నిందితుడు తన ప్రియురాలి మెడ, కడుపు, ఛాతీ, ముఖంపై 20 కంటే ఎక్కువ సార్లు పొడిచి చంపాడు.

ఈ సంఘటన తర్వాత ఇరుగుపొరుగు వారు పురానా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఇంత దారుణ హత్యను చూసి పోలీసులే షాక్ అయ్యారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంతలో, శనివారం(జూన్ 29), CIA వన్ పోలీసులు రిఫైనరీ రోడ్ నుండి నిందితుడు మహేంద్ర పాల్‌ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో, నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.

ప్రాథమిక విచారణలో, నిందితుడు మహేంద్ర కత్తితో మహిళ గొంతు కోసి చంపినట్లు అంగీకరించాడు. పోలీసులు ఆదివారం నిందితుడు మహేంద్ర పాల్‌ను కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుండి కోర్టు నిందితుడిని ఒక రోజు పోలీసు రిమాండ్‌కు పంపింది. మృతురాలు తన భర్తతో కలిసి ఆరు సంవత్సరాలుగా గంగారామ్ కాలనీలోని ఒక ఇంట్లో అద్దెకు నివసించింది. అయితే ఆమె భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. అనంతరం పరిచయమైన మహేంద్రతో సహ జీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!