Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Fire Accident: ఏమైంది ఈ దేశానికి..ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలే..

ఏమైంది ఈ దేశానికి..ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలే.. న్యూస్ చూస్తే చాలు.. వరుస అగ్ని ప్రమాదలే దర్శనమిస్తున్నాయి. పోని ఒక్కచోటే ఇలా జరుగుతుంది అని అనుకుంటే కాదే.. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. తాజాగా కేరళలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Kerala Fire Accident: ఏమైంది ఈ దేశానికి..ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలే..
Kerala Fire Accident
Velpula Bharath Rao
|

Updated on: Oct 29, 2024 | 8:08 AM

Share

కేరళలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేరళలోని కాసర్‌గోడ్‌లోని నీలేశ్వరం సమీపంలో సోమవారం అర్థరాత్రి ఆలయ పండుగ సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా, 150 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాసర్‌గోడ్ , కన్నూర్ , మంగళూరులోని  వివిధ ఆసుపత్రులకు తరలించారు . వీరర్కావు దేవాలయం సమీపంలోని బాణసంచా నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరిగిందని తెలుస్తుంది.

సంఘటనా స్థలానికి కలెక్టర్‌, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సహా జిల్లా పాలనా యంత్రాంగం ఉన్నతాధికారులు చేరుకున్నారు. బాధితులను వారి కుటుంబాలను ఆదుకోవడానికి స్థానిక సంఘాలు కలిసి రావడంతో అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కన్హంగాడ్ జిల్లా ఆసుపత్రిలో చేరిన ఐదుగురి పరిస్థితి చాలా విషమంగా ఉందని స్థానిక మీడియా పేర్కొంది. 33 మంది జిల్లా ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. 19 మందిని కన్హంగాడ్‌లోని ఐషాల్ ఆసుపత్రిలో చేర్చగా, 12 మంది అరిమల ఆసుపత్రిలో చేరారు.

నలభై మందిని సంజీవని ఆసుపత్రిలో చేర్పించారు, అదనంగా 11 మందిని నీలేశ్వర్ తాలూకా ఆసుపత్రికి, ఐదుగురిని కన్నూర్‌లోని ఆస్టర్ మిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జిల్లా యంత్రాంగం ప్రకారం, మరింత మంది క్షతగాత్రులను మంగళూరులోని ఆసుపత్రుల్లో మరియు కన్నూర్‌లోని పరియారంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు.

ప్రమాదానికి సంబంధించిన వీడియో:

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి