AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yasin Malik: యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు విధించిన కోర్టు.. మరణశిక్ష విధించాలని కోరిన ఎన్‌ఐఏ..

పాటియాలా హౌస్ కోర్టు(Patiala House Court) యాసిన్ మాలిక్‌(Yasin Malik)కు జీవిత ఖైదు విధించింది.NIA కోర్టులో టెర్రర్ ఫండింగ్ కేసులో అతను దోషిగా తేలాడు. పాటియాలా హౌస్ కోర్టు రెండు కేసుల్లో అతనికి జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు 10 కేసుల్లో పదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించారు. ఈ వేర్పాటువాద నాయకుడికి మరణశిక్ష విధించాలని NIA డిమాండ్ చేసింది. యాసిన్ మాలిక్‌పై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో […]

Yasin Malik: యాసిన్‌ మాలిక్‌కు జీవిత ఖైదు విధించిన కోర్టు.. మరణశిక్ష విధించాలని కోరిన ఎన్‌ఐఏ..
Yasin
Srinivas Chekkilla
|

Updated on: May 26, 2022 | 7:34 AM

Share

పాటియాలా హౌస్ కోర్టు(Patiala House Court) యాసిన్ మాలిక్‌(Yasin Malik)కు జీవిత ఖైదు విధించింది.NIA కోర్టులో టెర్రర్ ఫండింగ్ కేసులో అతను దోషిగా తేలాడు. పాటియాలా హౌస్ కోర్టు రెండు కేసుల్లో అతనికి జీవిత ఖైదు విధించింది. దీంతో పాటు 10 కేసుల్లో పదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించారు. ఈ వేర్పాటువాద నాయకుడికి మరణశిక్ష విధించాలని NIA డిమాండ్ చేసింది. యాసిన్ మాలిక్‌పై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు శిక్ష ఖరారు అవుతుండగా, లోయలోని ఆయన ఇంటి వద్ద గుమిగూడిన జనం ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. 65 నేరాలను తలపై పెట్టుకుని తిరుగుతున్న యాసిన్ మాలిక్‌కు శిక్ష పడిందని ఈ జనాలు ఆనందిస్తున్నారు.

శ్రీనగర్‌లో నలుగురు వైమానిక దళ సిబ్బందిని హతమార్చడం అతను ముష్కరులకు సహాయపడ్డాడు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తెను కిడ్నాప్ చేయడంలో నిందితుడిగా ఉన్నాడు. కాశ్మీరీ పండిట్‌లను చంపి వారిలో కూడా ఉన్నాడు. యాసిన్ మాలిక్‌పై క్రైమ్ కేసు హాఫ్ సెంచరీ దాటింది. 2019 లో, NIA యాసిన్ మాలిక్‌ను అరెస్టు చేసింది. అతని ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తు ప్రారంభించింది. 2016-17లో లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్ యాసిన్ మాలిక్‌కు డబ్బులు ఇచ్చారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. పాకిస్తానీ ఉగ్రవాదులు రాళ్లు రువ్వడం, పాఠశాలలను తగలబెట్టడం, బంద్‌లు, నిరసనలు చేయడం ద్వారా లోయను అస్థిరపరిచే పనిని అతనికి అప్పగించారు. ఈ కేసులో యాసిన్ మాలిక్, అసియా అంద్రాబీ, షబీర్ షాలతో సహా డజను మంది వేర్పాటువాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.

ఇవి కూడా చదవండి