AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest: రోడ్లపై మేకులను తొలగించడం లేదు.. మరో చోటుకు మారుస్తున్నాం అంతే: ఢిల్లీ పోలీసులు

#WATCH Video - Delhi police: గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన హింసాకాండ అనంతరం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న..

Farmers Protest: రోడ్లపై మేకులను తొలగించడం లేదు.. మరో చోటుకు మారుస్తున్నాం అంతే: ఢిల్లీ పోలీసులు
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2021 | 5:06 PM

Share

#WATCH Video – Delhi police: గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన హింసాకాండ అనంతరం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతోపాటు రైతులు రాజధానిలోకి ప్రవేశించకుండా ఘాజీపూర్ – ఢిల్లీ రోడ్డుపై (ఇనుప చువ్వలను) మేకులను అమర్చడంతోపాటు బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలను అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు గురువారం మేకులను తొలగిస్తున్నట్లు వీడియో వైరల్ అయింది. విమర్శలు వెల్లువెత్తిన అనంతరం ఢిల్లీ పోలీసులు మేకులను తొలగించారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. దీంతోపాటు పలు ఛానెళ్లు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా రోడ్డుపై ఉంచిన మేకులను తొలగించడం లేదని రీ పోజిషన్ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మరో చోటుకు మారుస్తున్నామని క్లారిటీ ఇస్తూ ఢిల్లీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

Also Read:

Farmers Protest: ఉద్యమం వెనుక రాజకీయాలు లేవు.. రైతు కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక గాంధీ

PM Narendra Modi: రైతులే మన దేశానికి వెన్నెముక.. చౌరీ చౌరా శతాబ్ధి ఉత్సవాల్లో ప్రధాని మోదీ