AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో వాళ్లకు బయటికి వెళ్తున్నానని చెప్పి.. టెర్రస్‌పైకి వెళ్లింది! ఆ తర్వాత..

బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌లో 21 ఏళ్ల డెంటల్ విద్యార్థిని సౌమ్య, పరీక్షల భయంతో 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల ఒత్తిడితో మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఆమె కుటుంబం ఇటీవలే ఆమెకు చికిత్స అందించింది. ఈ ఘటన హెబ్బాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇంట్లో వాళ్లకు బయటికి వెళ్తున్నానని చెప్పి.. టెర్రస్‌పైకి వెళ్లింది! ఆ తర్వాత..
Dental Student
Follow us
SN Pasha

|

Updated on: Apr 14, 2025 | 7:19 PM

బెంగళూరు నగరంలో నిన్న మధ్యాహ్నం పరీక్షల భయంతో 21 ఏళ్ల వైద్య విద్యార్థిని తన అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న డెంటల్ విద్యార్థిని సౌమ్యగా పోలీసులు గుర్తించారు. పరీక్షల భయంతో సౌమ్య మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై హెబ్బాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆత్మహత్యకు ముందు సౌమ్య ఎటువంటి డెత్ నోట్ రాయలేదని పోలీసులు తెలిపారు.

యశ్వంత్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో డెంటిస్ట్రీ రెండవ సంవత్సరం చదువుతున్న సౌమ్య, తన తండ్రి, తల్లి, సోదరుడితో కలిసి నివసించేది. సౌమ్య తండ్రి గణేష్ నారాయణ్ వృత్తిరీత్యా ఇంజనీర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆయన తన కుమార్తె చదువు కోసం కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. పరీక్షల భయంతో బాధపడుతున్న సౌమ్యను ఇటీవల ఆమె కుటుంబం చికిత్స కోసం నందిని లేఅవుట్‌లోని క్లినిక్‌లో చేర్చింది. కానీ నిన్న మధ్యాహ్నం బయటకు వెళ్తానని చెప్పిన సౌమ్య అపార్ట్‌మెంట్ టెర్రస్‌పైకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ద్వితీయ పీయూసీ ఫలితాలు: ఐదుగురి ఆత్మహత్య

కర్ణాటక సెకండ్ పీయూసీ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 9న విడుదల అయ్యాయి. తాము ఫెయిల్ అయ్యామని, ఆశించిన మార్కులు రాలేదని బాధపడి ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మైసూర్, బళ్లారి, దావణగెరె, హవేరి జిల్లాలు, బెంగళూరులో ఆత్మహత్య సంఘటనలు జరిగాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..