Jairam Ramesh: ఎన్నికలంటే అందాల పోటీ కాదు.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌ కీలక వ్యాఖ్యలు..

|

Dec 13, 2022 | 8:20 AM

రాజకీయాలు, ఎన్నికలంటే అందాల పోటీ కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ అభిప్రాయపడ్డారు. పార్టీలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టో, గుర్తుల మధ్యే పోటీ ఉంటుందని పేర్కొన్నారు.

Jairam Ramesh: ఎన్నికలంటే అందాల పోటీ కాదు.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌ కీలక వ్యాఖ్యలు..
Jairam Ramesh
Follow us on

రాజకీయాలు, ఎన్నికలంటే అందాల పోటీ కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ అభిప్రాయపడ్డారు. పార్టీలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టో, గుర్తుల మధ్యే పోటీ ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సిద్ధాంతాన్ని తమ పార్టీ భావిస్తుందని తెలిపారు. ఒకటి, రెండు సార్లు మినహా చాలా సమయాల్లో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించలేదన్నారు. రాజస్థాన్‌లో సీఎం గెహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ల మధ్య ఎటువంటి రాజకీయ పోరు లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహిళను కాంగ్రెస్‌ పార్టీ నిలబెడుతుందా..? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తెలుస్తుందన్నారు. ఎన్నికల్లో వచ్చే తీర్పు, ఫలితం పార్టీకే చెందాలి కానీ.. ఏ ఒక్క వ్యక్తికో కాదంటూ జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల ముందు ప్రకటించడంపై మాట్లాడిన జైరాం రమేష్.. కొన్ని సందర్భాల్లో మినహా తమ పార్టీ ఎన్నడూ అలా ప్రకటించలేదంటూ తెలిపారు. రాజస్థాన్‌ రాజకీయాల్లో భారత్‌ జోడో యాత్ర సానుకూల ఫలితాలు ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో గెలవడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని, వ్యవస్థలో ఎన్నికలు అనేవి ఒకరిద్దరి మధ్య జరిగే అందాల పోటీలు కావంటూ అభిప్రాయపడ్డారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అన్ని రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు ఇచ్చిందన్నారు. రాజస్థాన్ లో పార్టీని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్ మధ్య ఎలాంటి రాజకీయ పోరు లేదని.. వారిద్దరూ పార్టీకి ఎంతో విలువైన వ్యక్తులని తెలిపారు. అభిప్రాయ భేదాలు తప్ప మరేమి లేవంటూ జైరాం రమేశ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..