AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: ఢిల్లీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో భారీ భూప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

దేశ రాజధాని ఢిల్లీని వరుస భూకంపాలు వణికించాయి. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. దాదాపు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. నోయిడా, గురుగ్రామ్ సహా పలుచోట్ల ప్రకంపనలు రికార్డయ్యాయి.

Earthquake: ఢిల్లీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో భారీ భూప్రకంపనలు.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Earthquake
Sanjay Kasula
|

Updated on: Mar 22, 2023 | 7:29 AM

Share

భారీ భూ ప్రకంపనలతో ఉత్తర భారతదేశం వణికిపోయింది. మొత్తం 6 రాష్ట్రాలు భూకంపం వచ్చినట్లుగా గుర్తించారు. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి రిక్టర్ స్కేలుపై 6.6గా భూకంపం నమోదైంది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లలో కూడా భూకంపం సంభవించడంతో రాత్రి 10.20 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించి భయాందోళనకు గురై భవనాల నుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ రూపొందించిన ఆటోమేటెడ్ నివేదిక ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా కలాఫ్గన్‌కు 90 కిలోమీటర్ల దూరంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది.

ప్రకంపనలు చాలా బలంగా ఉండటంతో ఘజియాబాద్, నోయిడాలోని సిటీ సెంటర్‌లో జనం తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.అదే సమయంలో, నోయిడాలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం కనిపించింది.

ఢిల్లీలో ఇంతకుముందెన్నడూ ఇంత బలమైన ప్రకంపనలు సంభవించలేదని పలువురు చెప్పారు. అయితే అక్కడ భయం, భయాందోళన వాతావరణం నెలకొంది.

మంగళవారం (మార్చి 21) అర్థరాత్రి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో ఉంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. భారత్‌తో పాటు పాకిస్థాన్‌, తజికిస్థాన్‌, చైనాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.

ఈ భూకంపం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసిస్తున్న ప్రజల ఆందోళనను మరోసారి పెంచింది. వాస్తవానికి, ఈ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌లో 5 సార్లు కంటే ఎక్కువ భూకంపాలు సంభవించాయి. దీని ప్రభావం పాకిస్థాన్‌, భారత్‌పై కూడా పడింది. ఈ ప్రకంపనల మధ్య అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, భారత్‌లో పదే పదే భూకంపాలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్న జనాల్లో తలెత్తుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం