AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోళీకోడ్‌ విమానాశ్రయానికి ఏడాది ముందే నోటీసులు

కేరళలోని కోళీకోడ్‌ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే.

కోళీకోడ్‌ విమానాశ్రయానికి ఏడాది ముందే నోటీసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 08, 2020 | 4:10 PM

Share

DGCA notices to Kozhikode Airport: కేరళలోని కోళీకోడ్‌ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానాశ్రయంలో కొన్ని భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ గతేడాది ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కి నోటీసులు జారీ చేసింది. రన్‌వే, విమానాలు నిలిపే చోట(అప్రాన్‌)లో లోపాలు ఉన్న విషయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా ఈ విమానాశ్రయంలో గతేడాది జూలైలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో వెనుకభాగం దెబ్బతింది. దీనిపై విచారణ జరిపిన డీజీసీఏ అధికారులు విచారణ జరిపి, కొన్ని భద్రతా పరమైన లోపాలు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు. రన్‌వేపై పగుళ్లు ఉన్నాయని, అక్కడక్కడా నీరు నిలుస్తుందని, రబ్బరు ముక్కలు కూడా అధికంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ విమానాశ్రయంలో విమానాలు దిగడానికి ఏ మాత్రం సురక్షితం కాదని తొమ్మిదేళ్ల క్రితమే తాను తన నివేదికలో తెలిపానని ఎయిర్ సేఫ్టీ నిపుణుడు, మాజీ పైలట్ మోహన్ రంగనాథన్ తెలిపారు.

Read This Story Also: వారికి పరీక్షలు చేయండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు