AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా లెవెల్‌ సీన్‌.. అందరూ చూస్తుండగానే రూ.కోటి విలువైన బంగారు ఆభరణాల చోరీ

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కొందరు దొంగలు రెచ్చిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్‌ మండపం ప్రాంతంలో మాటువేసి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సినిమా లెవెల్‌ సీన్‌.. అందరూ చూస్తుండగానే రూ.కోటి విలువైన బంగారు ఆభరణాల చోరీ
Delhi Robbery
Anand T
|

Updated on: Sep 25, 2025 | 10:56 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కొందరు దొంగలు రెచ్చిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్‌ మండపం ప్రాంతంలో మాటువేసి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నగరానికి చెందిన శివమ్‌కుమార్‌ యాదవ్‌, రాఘవ్‌ అనే ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులతో ద్విచక్రవాహనంపై చాందినీ చౌక్‌ నుంచి బైరాన్‌ మందిర్‌ వెళ్లేందుకు బయల్దేరారు.

అయితే మార్గమధ్యలో వీళ్ల బైక్‌ను ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు భారత్‌ మండపం సమీపంలోకి రాగానే వారిని అడ్డకున్నారు. వాళ్ల దగ్గర ఉన్న తుపాకీని బయటకు తీసి దానికితో శివమ్‌కుమార్‌ యాదవ్‌, రాఘవ్‌లను బెదిరించి బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను లాక్కున్నారు. తర్వాత అక్కిడి నుంచి పారిపోయారు. దొంగల చేతిలో తుపాకి ఉండడంతో అక్కడున్న ఎవరూ వాళ్లను అడ్డుకునే సాహసం చేయలేదు.

ఇక చేసేదేమి లేక బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. దుండగులు ఎత్తుకెళ్లిన బ్యాగ్‌లో 500 గ్రాముల బంగారం, 35 కిలోల వెండి వరకు ఉందని వాటి విలువ రూ. కోటి మేర ఉంటుందని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జమ్మూలోకి చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. భీకర కాల్పులు!
జమ్మూలోకి చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. భీకర కాల్పులు!
దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో 'క్లోజ్డ్'బోర్డ్స్
దోశలు, ఆమ్లెట్లు అడగొద్దు.. క్యాంటీన్లలో 'క్లోజ్డ్'బోర్డ్స్
ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..
ఇద్దరు పెళ్లి కొడుకుల ఎంట్రీతో.. పెళ్లిలో ఊహించని ట్విస్ట్..
భార్యా భర్తల మధ్య అదే చిచ్చు పెడుతోందా? వెలుగులోకి వచ్చిన నిజాలు
భార్యా భర్తల మధ్య అదే చిచ్చు పెడుతోందా? వెలుగులోకి వచ్చిన నిజాలు
పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!
పుచ్చకాయ కొంటున్నారా ?? ఈ పొరపాట్లు చేయకండి!
ఆ డైరెక్టర్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: హరీశ్ శంకర్
ఆ డైరెక్టర్ ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా: హరీశ్ శంకర్
పీఎం కిసాన్ మీకు రాలేదా..? ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు..
పీఎం కిసాన్ మీకు రాలేదా..? ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు..
ఉగాది తర్వాత ఈ 3 రాశుల వారికి తిరుగులేదు!అప్పులు తీరి ఆదాయం డబుల్
ఉగాది తర్వాత ఈ 3 రాశుల వారికి తిరుగులేదు!అప్పులు తీరి ఆదాయం డబుల్
చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఏం పాపం చేశామమ్మా.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి..
ఏం పాపం చేశామమ్మా.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి..