Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం.. 21 ఏళ్ల యువతిని పదేపదే క‌త్తితో పొడిచిన యువకుడు.. వీడియో

ఈ కేసులో పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు కారణంగా ఢిల్లీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశమైంది.

దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం.. 21 ఏళ్ల యువతిని పదేపదే క‌త్తితో పొడిచిన యువకుడు.. వీడియో
Delhi Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 04, 2023 | 1:02 PM

దేశరాజధాని ఢిల్లీ దారుణాలకు అడ్డగా మారుతోంది. ఇప్పటికే పలు హత్యా ఉదంతాలు యావత్‌ దేశాన్ని వణికిస్తున్నాయి. తాజాగా, ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ నిరాకరించినందుకు గానూ 21 ఏళ్ల యువతిని అతి దారుణంగా,పట్టపగలే ఓ యువకుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి తనను దూరం పెట్టిందనే కోపంలో ఉన్న ఆ వ్య‌క్తి ఆమెను క‌త్తితో పొడిచాడు. సుమారు అయిదారుసార్లు క‌త్తితో పొడిచిన‌ట్లు వీడియో ఆధారంగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుడు సుఖ్వింద‌ర్‌ను అరెస్టు చేశారు. అత‌నిపై పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వారిద్దరికీ చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. అయితే ఈ ఇద్దరి మధ్య హఠాత్తుగా విభేదాలు వచ్చాయి. ఈ అమ్మాయి సుఖ్‌విందర్ సింగ్‌తో మాట్లాడటం మానేసింది. ఈ విషయంపై కోపోద్రిక్తుడైన సుఖ్వీందర్ యువతిపై దాడికి ఒడిగట్టాడు. కత్తితో పదేపదే పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. సుఖ్వీందర్ అంబాలాకు పారిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

గాయపడిన యువతిని ఢిల్లీలోని జహంగీర్‌పురిలోని బాబు జగ్జీవన్‌రామ్ ఆసుపత్రిలో చేర్చారు. యువతి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. ఈ కేసులో పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు కారణంగా ఢిల్లీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. .