AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liqour Scam: ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బిగుస్తున్న ఉచ్చు.. కవిత సాక్షిగా మారితే మరిన్ని కష్టాలు!

ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కవిత ప్రధాన సాక్షిగా మారవచ్చని తెలుస్తోంది. అయితే కవిత సాక్షిగా మారడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.

Delhi Liqour Scam: ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బిగుస్తున్న ఉచ్చు.. కవిత సాక్షిగా మారితే మరిన్ని కష్టాలు!
Sc On Kavitha Arrest
Balaraju Goud
| Edited By: TV9 Telugu|

Updated on: Apr 05, 2024 | 5:57 PM

Share

ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కవిత ప్రధాన సాక్షిగా మారవచ్చని తెలుస్తోంది. అయితే కవిత సాక్షిగా మారడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రభుత్వ సాక్షులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కనీసం 15 మంది కూడా సాక్ష్యం చెప్పవచ్చని తెలుస్తోంది. ఈ కేసు కారణంగా, ED సీఎం కేజ్రీవాల్‌కు 9 సార్లు సమన్లు ​​పంపింది. ఆ తర్వాత గురువారం అర్థరాత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో ప్రయోజనాలను పొందేందుకు కవితతో పాటు మరికొందరు ఆప్ అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారని విచారణలో వెల్లడైందని ఈడీ పేర్కొంది. కవిత ద్వారానే సౌత్ లాబీ రూ.100 కోట్లు లంచం ఇచ్చి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలోకి ప్రవేశించింది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం అర్థరాత్రి అరెస్టు చేశారు. వరుసగా 9 సార్లు సమన్లు ​​పంపారు. అయితే సీఎం కేజ్రీవాల్ ఒక్క సమన్‌కు కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత 10వ సమన్లతో గురువారం రాత్రి కేజ్రీవాల్ ఇంటికి ఈడీ చేరుకుంది. అక్కడ ఆయనను 2 గంటల పాటు విచారించారు. అనంతరం అర్థరాత్రి అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఈడీ అరెస్ట్ చేయడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిని ఆయన శుక్రవారం ఉపసంహరించుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…