AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Bhutan Tour: ‘నా అన్నయ్యకు స్వాగతం’.. భూటాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భూటాన్‌తో భారత్‌కు ఉన్న ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం శుక్రవారం భూటాన్ చేరుకున్నారు.

PM Modi Bhutan Tour: 'నా అన్నయ్యకు స్వాగతం'.. భూటాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
Pm Modi Bhutan Tour
Balaraju Goud
|

Updated on: Mar 22, 2024 | 3:31 PM

Share

‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భూటాన్‌తో భారత్‌కు ఉన్న ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం శుక్రవారం భూటాన్ చేరుకున్నారు. పారో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆయనకు భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికారు. పారో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి థింపూ వరకు 45 కి.మీ పొడవునా భారత్, భూటాన్ దేశాల జాతీయ జెండాలతో అలంకరించారు. మార్గానికి ఇరువైపులా నిలబడి ఉన్న భూటాన్ ప్రజలు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.

భారత్, భూటాన్‌ దేశాల మధ్య క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి మార్పిడి సంప్రదాయానికి అనుగుణంగా మోదీ ప్రభుత్వం ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’లో భాగంగా ఈ పర్యటన సాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భూటాన్ ప్రధాని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్ ‘ఎక్స్’లో హిందీలో ‘భూటాన్‌కు స్వాగతం, నా అన్నయ్యకు’ అని రాశారు. గతంలో మోదీ భూటాన్ పర్యటనపై ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. భారత్-భూటాన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన వివిధ కార్యక్రమాల్లో భూటాన్‌కు వెళ్తున్నాను. భూటాన్ రాజుతో పాటు భూటాన్ నాల్గవ రాజు, ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్‌గేని కలవడానికి సంతోషిస్తున్నాను. అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

ఈ పర్యటన మార్చి 21 నుంచి 22 వరకు జరగాల్సి ఉండగా భూటాన్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ఒకరోజు వాయిదా పడింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌లను కలుస్తారు. అతను తన భూటాన్ కౌంటర్ షెరింగ్ టోబ్గేతో కూడా చర్చలు జరుపుతారు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక, ప్రాంతీయ విషయాలపై అభిప్రాయాలను పరస్పరం బలోపేతం చేయడానికి ఈ పర్యటన వీలు కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విధివిధానాలను చర్చించడానికి అవకాశం కలిగిందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…