AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక ఫ్రీగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్.. సీఎం ప్రకటన..!

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటనలు. మొన్న మెట్రోలో మహిళలకు ఫ్రీ.. నిన్న బస్సులో మహిళలకు ప్రయాణం ఫ్రీ.. ఇక పరిమిత కరెంట్ వాడితే వారికి బిల్లు ఫ్రీ.. ఇలా ప్రకటనలు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాజాగా శుక్రవారం మరో ఉచిత ప్రకటన చేశారు. ఇక నుంచి మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండితే ప్రభుత్వమే క్లీనింగ్ సర్వీసులను కల్పించనుంది. […]

ఇక ఫ్రీగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్.. సీఎం ప్రకటన..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 16, 2019 | 8:23 AM

Share

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటనలు. మొన్న మెట్రోలో మహిళలకు ఫ్రీ.. నిన్న బస్సులో మహిళలకు ప్రయాణం ఫ్రీ.. ఇక పరిమిత కరెంట్ వాడితే వారికి బిల్లు ఫ్రీ.. ఇలా ప్రకటనలు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాజాగా శుక్రవారం మరో ఉచిత ప్రకటన చేశారు. ఇక నుంచి మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండితే ప్రభుత్వమే క్లీనింగ్ సర్వీసులను కల్పించనుంది. “ముఖ్యమంత్రి సెప్టిక్ ట్యాంక్ సఫాయి యోజన” పేరుతో ఈ పథకాన్ని ప్రకటించారు. ఢిల్లీ జల్ బోర్డ్ ఇందుకోసం 80 ట్రక్కులను.. ప్రత్యేక సిబ్బందిని కూడా సిద్ధం చేస్తోంది. ఈ ట్రక్కులతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో సర్వీసులను అందించనున్నట్లు తెలిపారు. ఈ క్లీనింగ్‌కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించనుంది.

ఢిల్లీ నగరంలోని పలు అనధికార కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని.. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రైవేట్ సర్వీసులు డ్రైనేజీని ఎక్కడ పడితే అక్కడే వదిలేయడంతో.. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని.. అందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాకుండా ప్రైవేట్ సర్వీసులు సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో పాటుగా.. కావాల్సిన పరికరాలు లేకపోవడంతో.. వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతూ.. ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్నారు. దీంతో ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేందుకు “ముఖ్యమంత్రి సెప్టిక్ ట్యాంక్ సఫాయి యోజన” పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!