CPP Meet: అన్నదాతల న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతాం.. పార్లమెంటరీ పార్టీ భేటీలో సోనియా ప్రకటన

రైతుల అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పు పట్టింది కాంగ్రెస్‌ పార్టీ. అన్నదాతల న్యాయమైన డిమాండ్ల కోసం తమ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు.

CPP Meet: అన్నదాతల న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతాం.. పార్లమెంటరీ పార్టీ భేటీలో సోనియా ప్రకటన
Congress Parliamentary Party
Follow us

|

Updated on: Dec 08, 2021 | 5:33 PM

Congress Parliamentary Party Meet: రైతుల అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పు పట్టింది కాంగ్రెస్‌ పార్టీ. అన్నదాతల న్యాయమైన డిమాండ్ల కోసం తమ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. ధరల పెరుగుదల, రైతుల డిమాండ్‌లు, సరిహద్దుల్లో ఉద్రిక్తత వంటి సమస్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వ్యవసాయ రంగం, సరిహద్దులో ఎదుర్కొంటున్న సవాళ్లపై పార్లమెంటులో చర్చకు తమ పార్టీ పట్టుబడుతుందని చెప్పారు.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి సోనియా గాంధీ ప్రసంగించారు. నాగాలాండ్‌లో మిలటరీ కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించడం పట్ల తీవ్ర వేదనను వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని కూడా ఆమె లేవనెత్తారు, ఈ చర్యను దౌర్జన్యంగా అని అభివర్ణించారు. శీతాకాల సమావేశాల మిగిలిన కాలానికి వారిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ ఛైర్మన్‌కు రాసిన లేఖలో వివరించినట్లుగా, ఇది రాజ్యాంగం, పార్లమెంటు వ్యవహారాలు ప్రవర్తన నియమాలు రెండింటినీ ఉల్లంఘిస్తుందని, వారందరూ సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు. సరిహద్దుల్లో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చకు పార్లమెంటుకు ఇంతవరకు అవకాశం ఇవ్వకపోవడం అసాధారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి పార్లమెంట్ ఉభయ సభల కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు.

రైతుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ. అన్నదాతల అంశాలపై మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తప్పుపట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు సాగించిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలను గుర్తించాలని ఎంపీలను కోరారు సోనియాగాంధీ.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిపిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మంది త్యాగాలను గౌరవిద్దామని ఎంపీలకు సూచించారు సోనియాగాంధీ. రైతులు, సామాన్య ప్రజానీకం సమస్యలపై మోడీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా వ్యవహరిస్తోందన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరల ప్రభావం ప్రతి కుటుంటం బడ్జెట్‌పై పెనుభారం చూపుతోందన్నారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు సోనియా. అటు వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై కూడా పార్లమెంటులో చర్చకు కాంగ్రెస్‌ పార్టీ పట్టుబడుతుందని తెలిపారు సోనియాగాంధీ.

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తిగా సరిపోవని ఆమె పేర్కొన్నారు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల కోత బాధ్యతను ప్రభుత్వం అప్పగించిందని ఆమె అన్నారు. బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేలు, విమానాశ్రయాలు వంటి విలువైన జాతీయ ఆస్తులను ప్రధాని మోడీ ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆమె ఆరోపించారు. “మొదట, నవంబర్ 2016 నాటి నోట్ల రద్దు చర్యతో ప్రధాని ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఆయన ఆ వినాశకరమైన మార్గంలో కొనసాగుతున్నారు, కానీ దానిని మానిటైజేషన్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు, అతను వ్యూహాత్మక, ఆర్థిక మరియు సామాజిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని గత డెబ్బై ఏళ్లుగా నిర్మించిన ప్రభుత్వ రంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు, ”అని ఆమె మండిపడ్డారు.

Read Also… Sudha Murthy: పెంపుడు కుక్క గోపీ పుట్టినరోజు వేడుకను సంప్రదాయంగా నిర్వహించిన సుధామూర్తి.. వీడియో వైరల్