
India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా అందోళన వ్యక్తమవుతోంది. కాగా.. గత 24 గంటల్లో (ఆదివారం) కరోనా (Covid-19) కేసుల సంఖ్య 3,207 నమోదైంది. శనివారంతో పోల్చుకుంటే (3,805) 600 కేసులు తగ్గాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 29 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 20,403 (0.05 శాతం) కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 0.95 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
దేశంలో నమోదైన కేసులు, రికవరీ వివరాలు..
#COVID19 | India reports 3,207 fresh cases, 3,410 recoveries, and 29 deaths in the last 24 hours. Active cases 20,403 pic.twitter.com/wb3403nXmh
— ANI (@ANI) May 9, 2022
మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: