కరోనా కట్టడికి వ్యాక్సినేషనే వజ్రాయుధం.. వివిధ మంత్రిత్వశాఖల ఉన్నతాధికారుల భేటీలో ప్రధాని మోదీ

కరోనా సెకండ్ వేవ్ మహోగ్రరూపం దాల్చింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారత్‌పై పంజా విసురుతోంది. లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవున్నాయి. వేలా..

కరోనా కట్టడికి వ్యాక్సినేషనే వజ్రాయుధం..  వివిధ మంత్రిత్వశాఖల ఉన్నతాధికారుల భేటీలో ప్రధాని మోదీ
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Apr 19, 2021 | 8:06 PM

కరోనా సెకండ్ వేవ్ మహోగ్రరూపం దాల్చింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారత్‌పై పంజా విసురుతోంది. లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో కేంద్రం అప్రమత్తమయింది. కరోనా కట్టడి దిశగా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దేశంలో కరోనా వ్యాప్తి, కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశానికి సిద్ధమయ్యారు.  సోమవారం పలు శాఖల మంత్రులు, నీతిఆయోగ్ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి, మెడిసిన్స్, ఆక్సిజన్, వెంటిటేటర్స్, వ్యాక్సినేషన్ సహా పలు వివరాల గురించి అధికారులతో సమీక్ష జరిపారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్న కరోనా కేసుల పరిస్థితిపై సమీక్షించారు. అలాగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై చర్చించారు. మరో వైపు దేశంలో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్‌ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న చాలా రాష్ట్రాల్లో ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోయాయి. దీంతో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత, రెమ్‌డిసివిర్‌ ఔషధంతో పాటు వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా ఉందని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. ఈ సమయంలో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రధాని మోదీ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసే ట్యాంకర్లు ఎలాంటి ఆటంకం లేకుండా 24 గంటలు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు  ప్రధాని సూచించారు. ఇక వైరస్‌ కట్టడి చర్యలను తప్పకుండా అమలు చేయాలని, టెస్టింగ్‌, ట్రాకింగ్‌, చికిత్సలతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రాష్ట్రాలు మరింత వేగవంతం చేయాలని మోదీ అన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య తీవ్రంగా ఉన్నందున రాష్ట్రాలు మరింత అప్రమత్తమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

UP Lockdown News: లక్నో సహా 5 నగరాల్లో లాక్‌డౌన్‌కు హైకోర్టు ఆదేశం..యూపీ సర్కార్ షాకింగ్ నిర్ణయం

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?