Corona Death: బీహార్ లో దారుణం..చెత్త బండిలో మృత దేహం తరలింపు.. చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు

Corona Death: కరోనా మహమ్మారి ఒక పక్క ప్రాణాలు తీసేస్తోంది. రోగం వచ్చిన వారికి ఆసుపత్రి బెడ్ దొరకదు. వ్యాధితో చనిపోయిన వారి శవాన్ని తీసుకు వెళ్ళడానికి నలుగురు మనుషులూ కరువైపోతున్నారు.

Corona Death: బీహార్ లో దారుణం..చెత్త బండిలో మృత దేహం తరలింపు.. చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు
Corona Death
Follow us

|

Updated on: May 17, 2021 | 1:13 PM

Corona Death: కరోనా మహమ్మారి ఒక పక్క ప్రాణాలు తీసేస్తోంది. రోగం వచ్చిన వారికి ఆసుపత్రి బెడ్ దొరకదు. వ్యాధితో చనిపోయిన వారి శవాన్ని తీసుకు వెళ్ళడానికి నలుగురు మనుషులూ కరువైపోతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల చనిపోయిన కరోనా పేషెంట్లను శ్మశానానికి తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ లు దొరకక ట్రాక్టర్ల లోనూ.. బైక్ ల మీదా తరలించిన దృశ్యాలు కనిపించాయి. అయ్యో అనిపించాయి. తాజాగా అటువంటి పరిస్థితే ఓ కోవిడ్ బాధిత మృతుని మృతదేహానికీ పట్టింది. ఇప్పుడు ఈ వీడియో ట్రేండింగ్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. పిపిఇ కిట్ ధరించిన మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు కోవిడ్ బాధితుడి మృతదేహాన్ని చెత్త బండిపై తీసుకెలుతున్నారు. ఈ మృతదేహాన్ని బీహర్‌షరీఫ్‌లోని శ్మశానవాటిక నెంబర్ 17 కు తరలించారు. ఇంతకీ ఆ బాధితుడి పేరు మనోజ్ కుమార్, మే 13 న కోవిడ్ -19 తో మరణించాడు. ఇతని మృతదేహాన్ని ఇలా చెత్త బండిలో వేసి శ్మశాన వాటికకు తరలించారు.

ఆ వీడియో మీరూ ఇక్కడ చూడొచ్చు..

ఈ సంఘటనపై నలంద సివిల్ సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ స్పందించారు. సరైన దర్యాప్తు తర్వాత ఈ సంఘటనలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ”కోవిడ్ బాధితుడి మృతదేహాన్ని చెత్త బండిపై శ్మశానవాటికకు తీసుకెళ్లినట్లు నాకు తెలిసింది. మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి మాకు 200 కి పైగా వాహనాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇలా చేశారనేది తెలియడం లేదు. ఈ విషయంపై సరైన దర్యాప్తు జరిపి సంఘటనకు బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకుంటారు ఈ సంఘటనలో పాల్గొన్న వారు “అని డాక్టర్ కుమార్ అన్నారు. ఈ మృత దేహాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ చివరి కర్మలు చేయమని కోరినట్లు స్థానికులు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ చివరి కర్మల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసిండి. క్లెయిమ్ చేయని మృతదేహాల చివరి కర్మలను కార్పొరేషన్ నిర్వహిస్తుంది. మృతదేహాన్ని మునిసిపల్ వాహనం నుంచి తీసుకుంటామని వార్డు కౌన్సిలర్ ప్రజలకు చెప్పారు. అంతకుముందు, కూడా కోవిడ్ బాధితుల మృతదేహాన్ని చెత్త బండ్లపై తీసుకువెళ్ళిన కొన్ని కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, బీహార్లో 82,487 క్రియాశీల COVID-19 కేసులు ఉండగా, ఇప్పటివరకు 5,58,785 మంది ఈ వ్యాధి నుండి కోలుకున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, మరణాల సంఖ్య 3,743 కు పెరిగింది.

Also Read: హైదరాబాద్‌ చెరువుల్లో కరోనా ఆనవాళ్లు… నీటిని తాకారో కరోనా గ్యారంటీ… ( వీడియో )

Vaccination: ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిన నగరాల్లో అదుపులో కరోనా వైరస్..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు