కొండెక్కి కూర్చున్న వంట నూనెల ధరలు
వంటనూనెల ధరలు పెట్రోల్లా మండిపోతున్నాయి.. నిత్యావసరాల వస్తువుల ధరలే కొండెక్కి కూర్చుంటే, వంట నూనెల ధరలేమో శిఖరంపై నిలుచున్నాయి.. లాక్డౌన్కు ముందు రేట్లను ఇప్పటి రేట్లను పోల్చి చూస్తే బెంబేలెత్తడం ఖాయం..
వంటనూనెల ధరలు పెట్రోల్లా మండిపోతున్నాయి.. నిత్యావసరాల వస్తువుల ధరలే కొండెక్కి కూర్చుంటే, వంట నూనెల ధరలేమో శిఖరంపై నిలుచున్నాయి.. లాక్డౌన్కు ముందు రేట్లను ఇప్పటి రేట్లను పోల్చి చూస్తే బెంబేలెత్తడం ఖాయం.. కిలో నూనె ధర 30 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పెరిగింది. ఇందుకు కరోనా వైరస్ ప్రభావమే కావచ్చు కానీ, ధరల పెరుగుదలకు ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ అప్పుడు అందరూ ఇంటిపట్టునే ఉన్నారు.. పిండివంటలు గ్రటాలు మామూలు రోజుల కంటే కొద్దిగా ఎక్కువగానే చేసుకున్నారు.. అంటే నూనె వాడకం బాగా పెరిగింది.. మన మలేషియా, ఇండోనేషియాల నుంచి పామాయిల్, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల నుంచి సోయా నూనె, రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్లు దిగుమతి అవుతుంటాయి.. వీటి ధరలు కూడా ఆమాంతం పెరిగాయి.. ఇక ఇప్పుడేమో ఆన్లాక్తో దాదాపుగా ఆంక్షలన్నీ తొలగిపోయాయి.. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు తెరచుకున్నాయి.. ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి.. పంక్షన్లు జరుగుతున్నాయి.. అందుకే నూనెల వాడకం విపరీతంగా పెరిగింది.. అదే సమయంలో సరఫరా దగ్గింది.. అందుకే వంట నూనెల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం వంట నూనెల రేట్లు కిలోకు 127 రూపాయల నుంచి 145 రూపాయల వరకు ఉంది.. నిరుడు ఇదే నెలలో కిలో నూనె 85 రూపాయల నుంచి వంద రూపాయలు ఉండింది.. మార్చి నెల మధ్యలో వంద రూపాయలు ఉన్న నూనె ధర ఇప్పుడు 145 రూపాయలు అయ్యింది. రాబోయేది పండుగల సీజన్.. దసరా, దీపావళి సంబరాలలో పిండివంటలు తప్పనిసరి! కాబట్టి నూనె ధర ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది..