Rahul Gandhi: రచ్చ రాజేస్తున్న కేంద్రమంత్రి ట్వీట్.. భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు..

రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. భారత్‌ జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేస్తున్నారు రాహుల్‌. ఓంకారేశ్వర్ ఆలయం దగ్గర నర్మదా నదీ తీరాన..

Rahul Gandhi: రచ్చ రాజేస్తున్న కేంద్రమంత్రి ట్వీట్.. భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు..
Smriti Irani, Union Minister
Follow us

|

Updated on: Nov 26, 2022 | 8:10 PM

రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. భారత్‌ జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేస్తున్నారు రాహుల్‌. ఓంకారేశ్వర్ ఆలయం దగ్గర నర్మదా నదీ తీరాన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి ఇస్తున్న ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించడం ఎంతో ఆనందం కలిగించిందని, ఆ తరవాత నర్మదా హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నానంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ హారతి ఇచ్చే సమయంలో ఆయన ఓ శాలువాను కప్పుకున్నారు. దానిపై ఓంకార ముద్రలు ఉన్నాయి. ఈ ఫోటోని రీట్వీట్ చేస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌పై సెటైర్లు విసిరారు. రాహుల్ కప్పుకున్న శాలువాపై ఓంకార ముద్రలు రివర్స్‌లో ఉన్నాయంటూ ఆ ఫోటోని రొటేట్ చేస్తూ స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. ఇప్పుడు సరిగా ఉంది అని ట్విటర్‌లో రాహుల్‌గాంధీ ఫోటోను రివర్స్‌లో పెట్టి షేర్ చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. స్మృతి ఇరానీపై కాంగ్రెస్‌ నేతలు కౌంటర్లు మొదలుపెట్టారు. సిలిండర్‌ ధర రూ. 400 ఉన్నప్పుడు స్మృతి ఇరానీ చేసిన ధర్నా ఫోటోను షేర్‌ చేస్తూ ఇప్పుడు గ్యాస్‌ ధర రూ. 1100కు చేరిందని ఆమె ఫోటోను కూడా రివర్స్‌లో పెట్టి కౌంటరిస్తున్నారు.

హిందూ ఆచారాలను అవమానిస్తున్నారంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్మృతి ఇరానీపై విమర్శలు చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. రాహుల్‌ గాంధీని ట్రోల్ చేసి “కిరీటం” సాధించుకున్నారు. ఇప్పుడు హిందూ ఆచారాలను ట్రోల్ చేస్తూ స్మృతి ఇరానీ ఆ కిరీటాన్ని ఆయన దగ్గర నుంచి లాగేసుకున్నారంటూ కౌంటర్ వేశారు ప్రియాంక చతుర్వేది.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ ప్రతినిధి లావణ్య బలాల్ కూడా స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీపై మీకున్న విద్వేషం తారస్థాయికి చేరుకుందని మండి పడ్డారు. పార్సీ మతస్తురాలు కావడం తోనే రాహుల్‌గాంధీని స్మృతి టార్గెట్‌ చేశారని ఆమె ట్వీట్‌ చేశారు. తనకు కేటాయించిన శాఖ తప్ప పనికిరాని అన్ని విషయాల్లో స్మృతి ఇరానీ తలదూరుస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్‌ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు