AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhi: విద్వేషాలు రెచ్చగొట్టి మైనార్టీలను కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తోంది.. చింతన్‌ శిబిర్‌ సభలో సోనియా..

Sonia Gandhi: వరుస పరాజయాలతో డీలా పడ్డ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా చింతన్‌ శిబిర్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే...

Sonia Gandhi: విద్వేషాలు రెచ్చగొట్టి మైనార్టీలను కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తోంది.. చింతన్‌ శిబిర్‌ సభలో సోనియా..
Narender Vaitla
|

Updated on: May 13, 2022 | 3:56 PM

Share

Sonia Gandhi: వరుస పరాజయాలతో డీలా పడ్డ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా చింతన్‌ శిబిర్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు మళ్లీ మంచి రోజులు తీసుకురావాలంటే ఏం చేయాలనే దానిపై నేతల మేధోమథనం చేయనున్నారు. శుక్రవారం మొదలైన ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సోనియా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సోనియా తనదైన శైలిలో స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ద్వేషాన్ని వ్యాపించడం ద్వారా మైనారిటీలను అణిచి వేస్తోందని ఆమె విమర్శించారు.

సభకు హాజరైన వారిని ఉద్దేశిస్తూ సోనియా మాట్లాడుతూ.. ‘పార్టీ మీకు చాలా ఇచ్చింది. ఇప్పుడు మీరు రుణాన్ని చెల్లించాల్సిన సమయం వచ్చింది. ఏ సంస్థ అయిన మనుగడ సాగించాలంటే మార్పు తీసుకురావాలి. పార్టీకి కూడా ఇప్పుడు సంస్కరణల అవసరం ఉంది.’ అని సోనియా అభిప్రాయపడ్డారు. ఇక మైనార్టీల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సోనియా కేంద్రంపై నిప్పులు చెరిగారు. బీజేపీ దేశ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోందని, గాంధీజీ హంతకులను ఆరాధిస్తున్నారని విమర్శించారు.

సోనియా ఇంకా మాట్లాడుతూ.. ‘దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మైనార్టీలను అణిచివేస్తున్నారు. మినిమం గవర్నమెంట్‌, మ్యాగ్జిమమ్‌ గవర్నెన్స్‌ అని చెప్పారు. దాని అర్థం దేశాన్ని నిట్టనిలువునా చీల్చడమేనా?’ అంటూ కేంద్రాన్ని సోనియా ప్రశ్నించారు. నిరంతరం ప్రజలను భయపెట్టడం, అభ్రదతతో ప్రజలను బతికేలా చేయడం, సమాజంలో భాగమైన మైనార్టీలను బలి పశువులను లక్ష్యంగా చేసుకొని క్రూరంగా హింసిస్తున్నారు అంటూ బీజేపీపై సోనియా మండి పడ్డారు.

ఇవి కూడా చదవండి

Follow Us
ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు!
ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు!
మిర్యాలగూడ సజీవ దహనం కేసులో ట్విస్ట్‌! అది ప్రమాదం కాదు.. స్కెచ్
మిర్యాలగూడ సజీవ దహనం కేసులో ట్విస్ట్‌! అది ప్రమాదం కాదు.. స్కెచ్
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు