AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు చైనా యాప్‌లను బ్లాక్‌ చేసిన కేంద్రం

డ్రాగన్ కంట్రీ చైనాపై డిజిటల్‌ స్ట్రైక్‌ను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. తాజాగా ఆ దేశానికి చెందిన మరో రెండు యాప్‌లను బ్లాక్‌ చేసింది.

రెండు చైనా యాప్‌లను బ్లాక్‌ చేసిన కేంద్రం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 04, 2020 | 3:10 PM

Share

Two Chinese Apps blocked: డ్రాగన్ కంట్రీ చైనాపై డిజిటల్‌ స్ట్రైక్‌ను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. తాజాగా ఆ దేశానికి చెందిన మరో రెండు యాప్‌లను బ్లాక్‌ చేసింది. ట్విట్టర్, గూగుల్ సెర్చ్‌కు ప్రత్యామ్నాయాలుగా ఉన్న వీబో, బైడు సెర్చ్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నివేదికల ప్రకారం వీటిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి కూడా తొలగించారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ రెండు యాప్‌లను తీసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా జూలై 27 న భారత ప్రభుత్వం నిషేధించిన 47 కొత్త యాప్‌లలో వీబో, బైడు సెర్చ్‌లు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటు చైనాకు చెందిన మరిన్ని యాప్‌లను నిషేధించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వారు వెల్లడించారు. కాగా భారత రక్షణ, సమగ్రత, భద్రతకు ఆటంకం కలిగిస్తున్న కారణంగా జూన్‌ 29న ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ తరువాత ఆ దేశానికి చెందిన వైబో నుంచి ప్రధాని మోదీ వైదొలిగిన విషయం తెలిసిందే.

Read This Story Also: సుశాంత్‌ గురించి కీలక విషయాలు వెల్లడించిన మాజీ ఫ్లాట్‌మేట్‌