AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh: భీకర ఘటన.. యువతిని స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. కారణం ఏంటో తెలుసా?

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 20 ఏళ్ల యువతిని ఓ కిరాతకుడు అత్యంత క్రూరంగా చంపేశాడు. స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు కసితీరా పొడిచి పొడిచి హతమార్చాడు.

Chhattisgarh: భీకర ఘటన.. యువతిని స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. కారణం ఏంటో తెలుసా?
Screwdriver
Shiva Prajapati
|

Updated on: Dec 27, 2022 | 4:42 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 20 ఏళ్ల యువతిని ఓ కిరాతకుడు అత్యంత క్రూరంగా చంపేశాడు. స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు కసితీరా పొడిచి పొడిచి హతమార్చాడు. ఈ భయానక ఘటన మంగళవారం చోటు చేసుకుంది. అయితే, యువతి తనతో మాట్లాడటకపోవడం వల్లే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడట. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోర్బా జిల్లాలో తనతో మాట్లాడేందుకు నిరాకరించినందుకు 20 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపాడు.

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఇసిఎల్) పంప్ హౌస్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది యువతి. అయితే, యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ఈ కీచకుడు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. అతను దిండు తీసుకుని ఆమె తలపై అదిమిపెట్టాడు. ఆ తరువాత స్క్రూ డ్రైవర్‌తో 51సార్లు పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, బాధితురాలి సోదరుడు ఇంటికి వచ్చి చూడగా.. యువతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది.

అయితే, జష్‌పూర్ జిల్లాకు చెందిన నిందితుడు మూడేళ్ల క్రితం ఓ ప్యాసింజర్ బస్సులో కండక్టర్‌గా పని చేసేవాడు. ఆ సమయంలో బాధిత యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. అలా ఇద్దరి మధ్య మాట మాట కలిసింది. నిందిత వ్యక్తి కొద్ది రోజుల తరువాత ఉపాధి కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లాడు. అయినప్పటికీ ఇద్దరూ ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. అయితే, విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆమె.. నిందిత వ్యక్తితో మాట్లాడటం మానేసింది. ఆగ్రహానికి గురైన అతను.. మొదట యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తరువాత నేరుగా ఇంటికే వచ్చి యువతి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పరారీలో ఉన్న నిందితుడి కోసం నాలుగు పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!
సక్సస్ పక్కా.. కొత్త ప్రయత్నాలకు వారికికి బెస్ట్ టైమ్ ఇదే..!
సక్సస్ పక్కా.. కొత్త ప్రయత్నాలకు వారికికి బెస్ట్ టైమ్ ఇదే..!
బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊతకోత.
బాక్సాఫీస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఊతకోత.
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్