వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫైన్లపై కేంద్రం రివర్స్ గేర్!

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వాహనదారులకు కంటి మీద కునుకు ఉండట్లేదు. రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వెతికి మరీ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలు ఖజానా నింపుకునేందుకే ఇలా భారీగా పెనాల్టీలను విధిస్తున్నారంటూ.. వాహనదారులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన చేపడుతున్నారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, […]

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫైన్లపై కేంద్రం రివర్స్ గేర్!
Follow us

|

Updated on: Sep 13, 2019 | 7:12 PM

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వాహనదారులకు కంటి మీద కునుకు ఉండట్లేదు. రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. చట్టంలో ఉన్న లూప్ హోల్స్ వెతికి మరీ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలు ఖజానా నింపుకునేందుకే ఇలా భారీగా పెనాల్టీలను విధిస్తున్నారంటూ.. వాహనదారులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన చేపడుతున్నారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం ఇప్పటికే అమలులోకి వచ్చింది. భారీ జరిమానాలతో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఇది ఇలా ఉండగా భారీ జరిమానాలు.. వాహనదారుల క్షేమం కోసమేనని పలు సందర్భాల్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కావాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలను సవరించవచ్చని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారే ఫైన్‌లను కడుతున్నారని.. ఉల్లఘించనప్పుడు జరిమానా కట్టాల్సిన అవసరం ఎందుకుని గడ్కరీ ప్రశ్నించారు కూడా. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం కోసమే నూతన మోటారు వాహనాల చట్టం అమలులోకి తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రజలు చట్టానికి భయపడినప్పుడే.. రూల్స్‌ను అతిక్రమించరని గడ్కరీ వెల్లడించారు.

ఇలా ఎన్నిసార్లు మంత్రి భారీ జరిమానాలపై వివరణ ఇచ్చినా.. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే వ్యతిరేకత లభించడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. జరిమానాలు తగ్గించడంపై కేంద్రం న్యాయ శాఖ సలహా కోరినట్లు సమాచారం. అటు కేంద్ర చట్టానికి భిన్నంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు తక్కువ ఫైన్లను విధించాలని నిర్ణయించాయి. రోడ్లు, రవాణా సదుపాయాలను మెరుగుపరిచిన తర్వాతే చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్రానికి మద్దుతు తెలిపింది. నూతన మోటారు వాహనాల చట్టం అమలు… భారీ జరిమానాల వల్ల రాజధాని ట్రాఫిక్ మెరుగవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఒకవేళ ప్రజలు అధిక ఫైన్ల వల్ల ఇబ్బందులు పడుతుంటే.. వాటిని సవరిస్తామని రాజధాని ప్రజలకు ఆయన అభయం ఇచ్చారు.  కొందరు కేంద్ర నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అనూహ్యంగా మరికొందరి నుంచి మద్దతు లభించడం విశేషం.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు