IT Act: ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఎ కింద నమోదైన కేసులన్నీ వెంటనే ఉపసంహరించుకోండి..రాష్ట్రాలను కోరిన కేంద్ర ప్రభుత్వం

IT Act: ఐటి చట్టంలోని సెక్షన్ 66 ఎ కింద నమోదైన కేసులన్నీ వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సెక్షన్ కింద నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

IT Act: ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఎ కింద నమోదైన కేసులన్నీ వెంటనే ఉపసంహరించుకోండి..రాష్ట్రాలను కోరిన కేంద్ర ప్రభుత్వం
It Act
Follow us

| Edited By: KVD Varma

Updated on: Jul 15, 2021 | 7:52 AM

IT Act: ఐటి చట్టంలోని సెక్షన్ 66 ఎ కింద నమోదైన కేసులన్నీ వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సెక్షన్ కింద నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, అలాగే ఈ చట్టం కింద ఇకపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు ఉన్నతాధికారులను కోరింది. ఈ ఉత్తర్వులో సుప్రీంకోర్టు అభ్యంతరాలను కేంద్రం ప్రస్తావించింది. తమ పోలీసుల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలకు పంపిన నోటీసులో, కొంతమంది పోలీసు అధికారులు ఇప్పటికీ ఈ విభాగం కింద కేసులు నమోదు చేస్తున్నారని ఇకపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేయడం ఆపివేయడమే కాకుండా ఇప్పటికే నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రం సూచించింది. ఐటి చట్టంలోని ఈ విభాగాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇది తప్పనిసరి అని చెప్పింది.

ఈ చట్టం పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విభాగం కింద కేసు నమోదు చేయవద్దని అన్ని పోలీస్ స్టేషన్లకు సూచనలు పంపించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాంటి కేసు ఏదైనా నమోదైతే దాన్ని ఉపసంహరించుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు సంబంధిత వర్గాలకు ఆదేశాలను జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది..

సుప్రీంకోర్టు ఏడు సంవత్సరాల క్రితం అంటే 2015లో ఐటి చట్టంలోని సెక్షన్ 66 ఎ రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. అయినప్పటికీ ఈ చట్టం కింద కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంపై ఎన్జీఓ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పియుసిఎల్) సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఏడేళ్ల క్రితం రద్దు చేసిన చట్టం కింద ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. దీనిని పరిశీలించిన తరువాత, జస్టిస్ ఆర్ నరిమన్, జస్టిస్ కెఎమ్ జోసెఫ్, జస్టిస్ బిఆర్ గవై ధర్మాసనం ఇది ఆశ్చర్యకరమైన విషయం అని పేర్కొంది. ఈ విషయంపై కేంద్రానికి మేము నోటీసు ఇస్తాము. అసలు ఇలా జరుగుతుండటం భయంకరమైన విషయం అంటూ ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు 2015 లో చారిత్రాత్మక తీర్పు..

24 మార్చి 2015 న చారిత్రాత్మక తీర్పు ఇస్తూ ఐటి చట్టంలోని సెక్షన్ 66 ఎను రద్దు చేసింది. ఈ చట్టం అస్పష్టంగా, రాజ్యాంగ విరుద్ధమని, వాక్ స్వాతంత్య్ర హక్కును ఉల్లంఘిస్తోందని కోర్టు పేర్కొంది. ఈ విభాగం కింద, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో అప్రియమైన లేదా దుర్వినియోగమైన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు వినియోగదారుని అరెస్టు చేసే హక్కు పోలీసులకు ఉంది.

Also Read: Sharad Pawar: ఫలితాల గురించి అంతా తెలుసు.. రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం అబద్ధం: శరద్‌ పవార్‌

బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి ఇంటివద్ద సీఐడీ బృందం.. పర్సనల్ గార్డ్ సూసైడ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

Latest Articles
ఉల్లి తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా.? నిపుణులేమంటున్నారు.?
ఉల్లి తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా.? నిపుణులేమంటున్నారు.?
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!