AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancelled Train List: రైల్వే ప్రయాణికులకు గమనిక.. వారం రోజులపాటు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు.. కారణం ఇదే

భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ప్రయాణికులు ఈ కింద పూర్కొన్న రైలు రద్దులు, మళ్లింపులను గమనించవలసిందిగా ఆయన సూచించారు. గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌: గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌..

Cancelled Train List: రైల్వే ప్రయాణికులకు గమనిక.. వారం రోజులపాటు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు.. కారణం ఇదే
Cancelled Train List
Srilakshmi C
|

Updated on: Nov 05, 2023 | 9:56 AM

Share

విజయవాడ, నవంబర్‌ 5: భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ప్రయాణికులు ఈ కింద పూర్కొన్న రైలు రద్దులు, మళ్లింపులను గమనించవలసిందిగా ఆయన సూచించారు.

  • గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌: గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ నవంబర్‌ 6 నుంచి 12వ తేదీ వరకు రద్దు అవుతుంది
  • రాజమండ్రి-విశాఖపట్నం మెము స్పెషల్ ఎక్స్‌ప్రెస్: రాజమండ్రి నుండి విశాఖపట్నం (రైలు నెం. 07466) నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రద్దు అవుతుంది.
  • విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం ఎక్స్‌ప్రెస్‌: విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం (07467) రైళ్ల సర్వీసులు నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రద్దు చేయబడతాయి.
  • విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్: విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240)ను నవంబర్‌ 7 నుంచి 13వ తేదీ వరకు రద్దు చేసినట్లు ప్రకటించారు.

దీపావళి స్పెషల్‌ రైళ్లు.. చెన్నై సెంట్రల్‌- భువనేశ్వర్‌ మధ్య ప్రత్యేక సర్వీసులు

ప్రతీయేట దీపావళి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందనే విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది కూడా పండగ నేపథ్యంలో చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- భువనేశ్వర్‌ (06073) ప్రత్యేక రైలు నవంబర్‌13, 20, 27 తేదీల్లో నడుస్తుంది. ఈ ట్రైన్‌ రాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఆ తర్వాత 11.20గంటలకు బయలుదేరి వెళుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణం ఇలా ఉంటుంది.. భువనేశ్వర్‌- చెన్నై సెంట్రల్‌ (06074) ప్రత్యేక రైలు నంబర్‌ 14, 21, 28 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. ఇక్కడి నుంచి తిరిగి 3.50 గంటలకు బయలుదేరి వెళుతుందని అధికారులు తెలిపారు.

సూరత్‌-బ్రహ్మపుర మధ్య దీపావళి స్పెషల్‌ రైళ్లు..

సూరత్‌-బ్రహ్మపుర (09069) ప్రత్యేక రైలు నవంబర్‌ 8, 15, 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ట్రైన్‌ డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 2.20 గంటలకు సూరత్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.10 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 8.58 గంటలకు పెందుర్తికి చేరుకుంటుంది. తిరిగి తిరుగు బ్రహ్మపుర-సూరత్‌ (09070) ప్రత్యేక నవంబర్‌ 10, 17, 24 తేదీల్లో, అలాగే డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి ఉదయం 7.10 గంటలకు పెందుర్తికి, ఆ తర్వాత 8.20 గంటలకు దువ్వాడకు చేరుకుంటుందరని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రయాణికులు ప్రత్యేక రైళ్ల సదుపాయాలను వినియోగించుకోవల్సిందిగా రైల్వే విభాగం సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.