రాయ్గఢ్ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ట్విట్టర్లో ట్వీట్లు చేశారు. ఈ ప్రమాద వార్త తమను కలచి వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు..
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ట్విట్టర్లో ట్వీట్లు చేశారు. ఈ ప్రమాద వార్త తమను కలచి వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి, ప్రధాని తెలిపారు. అలాగే ప్రమాద స్థలంలో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారని, బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయినట్టు అధికారులు గుర్తించారు. అలాగే మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ప్రమాదం స్థలంలో సహాయ సహకారాలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరో 18 మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అంటున్నారు.
PM Modi expresses anguish over the building collapse in Mahad, Raigad in Maharashtra.
“My thoughts are with the families of those who lost their dear ones. I pray the injured recover soon.”, PM tweets pic.twitter.com/vILAdsKK1j
— ANI (@ANI) August 25, 2020
President Ram Nath Kovind expresses his distress over the Raigad building collapse tragedy in Maharashtra.
President Kovind tweets, “My thoughts and prayers are with the accident victims. I wish speedy recovery of the injured.” pic.twitter.com/qR9JpTqGlr
— ANI (@ANI) August 25, 2020
Read More:
వినూత్న ప్రయోగం.. వాట్సాప్లో గణేష్ లడ్డూ వేలం
బిగ్బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ
పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!