Budget Session 2023: బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ సేమ్ సీన్ రిపీట్.. పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారానికి వాయిదా..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ఖండిస్తూ లోక్​సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్​సభలో వెల్​లోకి దూసుకెళ్లారు.

Budget Session 2023: బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ సేమ్ సీన్ రిపీట్.. పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారానికి వాయిదా..
Budget Session
Follow us

|

Updated on: Mar 13, 2023 | 3:26 PM

పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాల రెండో విడతలోనూ అదే తీరులో రచ్చ కనిపిస్తోంది. సభలో ఎంపీలు ఆందోళనలు చేయడం వల్ల లోక్​సభ మంగళవారంకు వాయిదా పడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ఖండిస్తూ లోక్​సభలో మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్​సభలో వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో సభను ముందుగా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా. మరోవైపు, రాజ్యసభలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్దల సభ సైతం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ప్రారంభమైన సమావేశాల్లో కూడా అదే గందరగోళం కొనసాగింది. దీంతో రెండు సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

రెండో విడత బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​.. ఇటీవలే రాహుల్​ గాంధీ లండన్​లో జరిగిన ఓ సెమినార్​లో చేసిన కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై రాహుల్​ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి కోరారు. లండన్​లో భారతదేశ పరువు తీశారని ఆయన ఆరోపించారు. ఈ సభలో సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ లండన్​లో భారత్​ను అవమానించారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులందరూ ఖండించాలి. రాహుల్​ సభా ముఖంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నారని రక్షణ మంత్రి అన్నారు.

రాహుల్ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరారని ఆరోపించారు. రాజ్​నాథ్​ సింగ్​ చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో పాటుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రస్తుతం భారత్​లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని.. మరింత బలపడుతుందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం