AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుద్ధి మారని పాక్.. ఆ క్షణం కోసం వేచి చూస్తున్నాం.. పాకిస్తాన్‌కు BSF IG స్ట్రాంగ్ వార్నింగ్..!

భారత్-పాక్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దు భద్రతా దళం (BSF) IG శశాంక్ ఆనంద్ పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్ చేసే ఏదైనా దుస్సాహసానికి బలమైన ప్రతిస్పందన ఉంటుందని ఆయన శుక్రవారం (అక్టోబర్ 10) అన్నారు. "మేము ఆపరేషన్ సిందూర్‌లో స్పందించాము. అవసరమైతే భవిష్యత్తులో తీవ్ర ప్రతిస్పందన తప్పదు" అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బుద్ధి మారని పాక్.. ఆ క్షణం కోసం వేచి చూస్తున్నాం.. పాకిస్తాన్‌కు BSF IG స్ట్రాంగ్ వార్నింగ్..!
Bsf Ig Shashank Anand
Balaraju Goud
|

Updated on: Oct 10, 2025 | 3:15 PM

Share

భారత్-పాక్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దు భద్రతా దళం (BSF) IG శశాంక్ ఆనంద్ పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్ చేసే ఏదైనా దుస్సాహసానికి బలమైన ప్రతిస్పందన ఉంటుందని ఆయన శుక్రవారం (అక్టోబర్ 10) అన్నారు. “మేము ఆపరేషన్ సిందూర్‌లో స్పందించాము. అవసరమైతే భవిష్యత్తులో తీవ్ర ప్రతిస్పందన తప్పదు” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బుద్ధి మారని పాకిస్తాన్ నిరంతర కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని శశాంక్ ఆనంద్ పేర్కొన్నారు. వారి వేగాన్ని గ్రహించారు. BSF శీతాకాల వ్యూహం సిద్ధంగా ఉంది. పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ప్రయోజనం కోసం కొత్త, అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెబుతామన్నారు.

డ్రోన్ల విషయంలో ఒక పెద్ద సవాలు అని శశాంక్ ఆనంద్ అన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో వీటిని ఉపయోగిస్తున్నారు. సరిహద్దు వెంబడి, లోతట్టు ప్రాంతాలలో మా కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు పూర్తిగా మోహరించాయి. గ్వాలియర్‌లోని బిఎస్‌ఎఫ్ అకాడమీలో డ్రోన్ వార్‌ఫేర్ స్కూల్ స్థాపించి, ఇక్కడ డ్రోన్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. సైనికులకు డ్రోన్‌లలో శిక్షణ ఇస్తున్నామని ఆయన అన్నారు. కొంతమంది సైనికులు ఇప్పటికే శిక్షణ పొందారని ఆయన తెలిపారు.

ఇటీవల, రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఇద్దరు పాకిస్తానీ జాతీయులను అదుపులోకి తీసుకుంది. అందులో ఒక మైనర్ కూడా ఉన్నారు. సెడ్వా సెక్టార్‌లో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి వారిద్దరూ ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. BSF 83వ బెటాలియన్‌కు చెందిన సైనికులు భిల్ వ్యక్తి అయిన కాంజీ (47), ఏడేళ్ల బాలుడిని జన్పాలియా సరిహద్దు అవుట్‌పోస్ట్‌లోని జీరో పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. “ఇద్దరు అనుమానితులను రెండు దేశాల మధ్య ఉన్న కంచె లేని ప్రాంతం గుండా భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా BSF సిబ్బంది ఆపారు. వారు భారత కంచెను దాటకముందే వారిని పట్టుకున్నారు” అని బార్మర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ మీనా అన్నారు.

ఇదిలావుంటేచ భారతదేశం-పాకిస్తాన్ మధ్య మరో యుద్ధం జరుగుతుందని పాకిస్తాన్ రక్షణరంగ నిపుణుడు ఖమర్ చీమా అంచనా వేశారు. ఈసారి సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో జరిగిన కార్ప్స్ కమాండర్ల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇది భారతదేశం ప్రకటనలు, మధ్యప్రాచ్యం, ప్రపంచంలో పాకిస్తాన్ ప్రాముఖ్యత, సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం గురించి చర్చించిందని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..