Operation Sindoor: మరో ఇద్దరు వీర జవాన్లను కోల్పోయిన భారత్! పాకిస్థాన్ కాల్పుల్లో అమరులైన మెహమ్మద్, దీపక్
జమ్మూ డివిజన్లోని ఆర్ఎస్ పురా ప్రాంతంలో మే 9, 10 తేదీల మధ్య పాకిస్తాన్ రేంజర్లు జరిపిన సరిహద్దు కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ దీపక్ చింగాఖం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. ఇదే కాల్పుల్లో మరో జవాన్, సబ్-ఇన్స్పెక్టర్ మెహమ్మద్ ఇంతేయాజ్ కూడా మృతిచెందారు. బీఎస్ఎఫ్ వారి త్యాగాన్ని స్మరించి పూర్తి గౌరవాలతో నివాళులు అర్పించింది.

మే 9, 10 తేదీల మధ్య జమ్మూ డివిజన్లోని ఆర్ఎస్ పోరా ప్రాంతంలో పాకిస్తాన్ రేంజర్లు జరిపిన సరిహద్దు కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ దీపక్ చింగాఖం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆపరేషన్ సిందూర్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరో సైనికుడిని కోల్పోయింది. “విధి నిర్వహణలో కానిస్టేబుల్ దీపక్ చింగాఖం చేసిన అత్యున్నత త్యాగానికి డీజీ బీఎస్ఎఫ్, అన్ని ర్యాంకులు సెల్యూట్ చేస్తున్నాయి. జమ్మూలోని ఆర్ఎస్ పురా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 2025 మే 10న పాకిస్తాన్ జరిపిన సరిహద్దు కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. ఈ రోజు అంటే 2025 మే 11న ఆయన మరణించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రహరీ పరివార్ మృతుల కుటుంబానికి అండగా నిలుస్తుంది” అని బీఎస్ఎఫ్ ఎక్స్లో పోస్ట్ చేసింది.
మరణించిన జవాన్కు పూర్తి గౌరవాలతో పుష్పగుచ్ఛాలు ఉంచే కార్యక్రమం ఈ రోజు (సోమవారం) జమ్మూ సరిహద్దు ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది అని బీఎస్ఎఫ్ తెలిపింది. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ఆదివారం దీపక్ బలిదానంపై స్పందించారు. “అతను మణిపూర్ గర్వించదగిన కుమారుడు, ఒక మైటీగా, అతని ధైర్యం, దేశం పట్ల అంకితభావం మన ప్రజలలో చాలా మందిలో నివసించే లోతైన కర్తవ్య భావాన్ని ప్రతిబింబిస్తాయి” అని పోస్ట్ చేశారు. శనివారం జరిగిన కాల్పుల్లో బిఎస్ఎఫ్ 7వ బెటాలియన్కు చెందిన ఎనిమిది మంది సిబ్బంది గాయపడ్డారు. సబ్-ఇన్స్పెక్టర్ మెహమ్మద్ ఇంతేయాజ్ సైతం గాయాల కారణంగా మరణించారు.
ఆదివారం జమ్మూలోని పలౌరాలోని బిఎస్ఎఫ్ సరిహద్దు ప్రధాన కార్యాలయంలో ఇంత్యాజ్కు పూర్తి సైనిక గౌరవాలతో పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం బీహార్లోని సరన్ జిల్లాలోని ఆయన స్వస్థలం నారాయణపూర్ గ్రామంలో జరుగుతాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం సరణ్ జిల్లాకు చెందిన బిఎస్ఎఫ్ ఎస్ఐ ఇంతియాజ్ మృతికి సంతాపం తెలిపారు. ఇంతియాజ్ త్యాగాన్ని ఎల్లప్పుడూ గర్వంగా, కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాం అని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం.. మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
DG BSF and All Ranks salute the supreme sacrifice made by BSF Sub Inspector Md Imteyaz in service to the Nation on 10 May 2025 during cross border firing by Pakistan along the International Boundary in R S Pura area, Jammu.
Prahari Pariwar stands firm with the bereaved family in… pic.twitter.com/eQeoLAHlEU
— BSF (@BSF_India) May 10, 2025
DG BSF and All Ranks salute the supreme sacrifice made by Constable Deepak Chingakham in the line of duty.
He was injured in cross border fire by Pakistan on 10th May 2025 along the International Boundary in R S Pura area, Jammu. He succumbed to his injuries today on 11th May… pic.twitter.com/W7NLLzBek1
— BSF (@BSF_India) May 11, 2025
In a solemn Wreath laying ceremony, Shri Manoj Sinha, Hon’ble Lieutenant Governor, Jammu and Kashmir UT & all ranks of #BSF Jammu paid homage to Braveheart Sub Inspector Md Imtiyaz who made supreme sacrifice in the line of duty during cross border firing near International… pic.twitter.com/x3xG24cUYN
— BSF JAMMU (@bsf_jammu) May 11, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
