AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెర్రరిస్టు సానుభూతిపరులతో బాలీవుడ్ సెలబ్రెటీల లింక్ ! ఫోటోలు వైరల్ !

బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరికి పాకిస్తాన్ గూఢచార సంస్థ..ఐఎస్ఐ తోను, పాక్ ఆర్మీ తోను లింక్ ఉందని బీజేపీ నేత వైజయంత్ పాండా చేసిన ఆరోపణకు నిదర్శనంగానా అన్నట్టు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరి.....

టెర్రరిస్టు సానుభూతిపరులతో బాలీవుడ్ సెలబ్రెటీల లింక్ ! ఫోటోలు వైరల్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 23, 2020 | 4:40 PM

Share

బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరికి పాకిస్తాన్ గూఢచార సంస్థ..ఐఎస్ఐ తోను, పాక్ ఆర్మీ తోను లింక్ ఉందని బీజేపీ నేత వైజయంత్ పాండా చేసిన ఆరోపణకు నిదర్శనంగానా అన్నట్టు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరి…రెహనా సిద్దిఖీ, టోనీ అషయ్ అనే నిందితులతో ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రచారం చేస్తారని, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేస్తున్నారనే ఆరోపణలు ఈ టెర్రరిస్టు సానుభూతిపరులపై ఉన్నాయి. అమెరికాలో ఉన్న టోనీ అషయ్  తో షారుఖ్ దంపతులకు బిజినెస్ లింకులు ఉన్నట్టు చెబుతున్నారు. కాశ్మీరీ వాసి అయిన టోనీ.. కాశ్మీరీ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నారట. ఇక పాకిస్థానీ అయిన రెహనా సిద్దిఖీ ..హూస్టన్ లో ఓ రేడియో ఛానల్ నిర్వహిస్తున్నాడని, దాని ద్వారా కాశ్మీర్ లో ఇండియాకు వ్యతిరేకంగా విషం కక్కే ప్రచారం చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. తరచూ బాలీవుడ్ సెలబ్రిటీలను అమెరికాకు ఆహ్వానించి తన ఈ ఛానల్ ద్వారా మ్యూజిక్ కాన్సర్ట్ లు కూడా నిర్వహిస్తున్నాడట.. ఇతనితో కూడా షారుఖ్ కపుల్ కి కమర్షియల్ లింకులు ఉన్నట్టు తెలుస్తోంది.