బోడో ఒప్పందం చరిత్రాత్మకం.. అమిత్ షా

అస్సాంలో నిషిధ్ధ మిలిటెంట్ గ్రూప్-నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ కు మంచి రోజులు వచ్చాయి. . బోడోలాండ్ విషయంలో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఈ గ్రూప్ తో సోమవారం  ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన హోం మంత్రి అమిత్ షా ఇది చరిత్రాత్మక ఒప్పందమని అభివర్ణించారు. ఈ ఒప్పందంతో.. దశాబ్దాల తరబడి కొనసాగిన బోడోలఉద్యమానికి తెర పడింది. బోడో ప్రాంత అభివృద్దికి ఇది ఎంతో తోడ్పడుతుందన్నారు. అలాగే ఇదే సమయంలో అస్సాం కూడా మరింత […]

బోడో ఒప్పందం చరిత్రాత్మకం.. అమిత్ షా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 27, 2020 | 5:43 PM

అస్సాంలో నిషిధ్ధ మిలిటెంట్ గ్రూప్-నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ కు మంచి రోజులు వచ్చాయి. . బోడోలాండ్ విషయంలో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఈ గ్రూప్ తో సోమవారం  ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన హోం మంత్రి అమిత్ షా ఇది చరిత్రాత్మక ఒప్పందమని అభివర్ణించారు. ఈ ఒప్పందంతో.. దశాబ్దాల తరబడి కొనసాగిన బోడోలఉద్యమానికి తెర పడింది. బోడో ప్రాంత అభివృద్దికి ఇది ఎంతో తోడ్పడుతుందన్నారు. అలాగే ఇదే సమయంలో అస్సాం కూడా మరింత అభివృద్ది చెందుతుందన్నారు. కాగా బోడోల ప్రయోజనాలకు గాను రూ. 1500 కోట్ల ఆర్ధిక ప్యాకేజీని రాష్ట్ర బీజేపీ మంత్రి హిమాంత బిశ్వ శర్మ ప్రకటించారు.

ఈ ఒప్పందంపై అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్, నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ప్రతినిధులతో బాటు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు, ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇక ఈ ఒప్పందం మేరకు 1500 మందికి పైగా మిలిటెంట్లు తమ ఆయుధాలతో సహా ఈ నెల 30 న ప్రభుత్వానికి లొంగిపోనున్నారు. వీరు ఇక మిలిటెంట్లు కారని, మన సోదరులని అమిత్ షా వ్యాఖ్యానించారు. తాజాగా కుదిరిన ప్యాకేజీ అగ్రిమెంట్ ప్రకారం.. బోడో ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని అందజేయనున్నారు.