AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. అనుమానంతో ఐదుగురిని కొట్టి చంపిన గ్రామస్తులు.. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పోలీస్!

ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ కుటుంబంపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు.

దారుణం.. అనుమానంతో ఐదుగురిని కొట్టి చంపిన గ్రామస్తులు.. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పోలీస్!
Witchcraft
N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 15, 2024 | 6:48 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ కుటుంబంపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు.

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ చేతబడి వంటి మూఢనమ్మకాలు ఇంకా తొలగిపోలేదు. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో క్షుద్ర పూజల పేరుతో ఎంతోమంది బలవుతున్నారు. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ఓకుటుంబంపై దాడి చేశారు. విచక్షణ కోల్పోయి.. ఐదుగురిని కర్రలతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. మృతులు ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈదారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆకుంటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

సుక్మా జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎట్కల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. హత్య చేసిన తర్వాత కుంట పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు గ్రామస్తులు లొంగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ కిరణ్ చౌహాన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసును ఛాలెంజ్‌గా తీసుకుని దారుణానికి పాల్పడ్డ మరికొందరి కోసం పోలీసు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా హెడ్‌ కానిస్టేబుల్ బుచ్చ కుటుంబం చేతబడి చేస్తున్నారని.. అందుకే గ్రామస్తులు ఒక్కొక్కరిగా అనారోగ్యానికి గురై మరణిస్తున్నారంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేతబడి వల్ల గ్రామంలో ఒక్కొక్కరు చనిపోతున్నారనే అనుమానంతో ఈ హత్యలు జరిగాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్