AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Observers: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో తేలని సీఎం.. ఎంపిక బాధ్యత బీజేపీ పరిశీలకులకు అప్పగింత

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ పరిశీలకులను ప్రకటించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ పరిశీలకుల పేర్లను వెల్లడించింది. మూడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి పేరును ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

BJP Observers: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో తేలని సీఎం.. ఎంపిక బాధ్యత బీజేపీ పరిశీలకులకు అప్పగింత
Pm Modi, Jp Nadda, Amit Shah
Balaraju Goud
|

Updated on: Dec 08, 2023 | 12:27 PM

Share

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ పరిశీలకులను ప్రకటించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ పరిశీలకుల పేర్లను వెల్లడించింది. మూడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి పేరును ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినా.. ఇంకా ముఖ్యమంత్రులు ఎవరనేది స్పష్టత రాలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం అయా రాష్ట్రాలకు పరిశీలకు పంపి, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో పార్టీ పరిశీలకులను నియమించింది బీజేపీ హైకమాండ్. మూడు రాష్ట్రాల సీఎంలపై డిసెంబర్ 10న తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రాజస్థాన్ పరిశీలకునిగా చేసింది బీజేపీ. వినోద్ తావ్డే, సరోజ్ పాండేలను తన అసిస్టెంట్ సర్వేయర్లుగా పంపారు. అదే సమయంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్, ఆశా లక్రాలను మధ్యప్రదేశ్‌కు పరిశీలకులుగా పంపారు. ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక చేసే బాధ్యతను బీజేపీ కేంద్ర మంత్రి సర్బానంద సోనేవాల్‌కు అప్పగించింది బీజేపీ అధిష్టానం. అతనికి సహాయం చేయడానికి అర్జున్ ముండాను పంపారు.

ఇదిలావుంటే మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పకుండానే ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలోనే మూడు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశాలను పర్యవేక్షించే బాధ్యతను పరిశీలకులకు అప్పగించింది. బీజేపీ శాసనసభ్యులు తమ నాయకులను ఎన్నుకోనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు