దారుణం.. రోడ్డు పక్కన భజన చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి!
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి, అతివేగంగా వస్తున్న కారు బీభత్సం సృష్టించింది. సుపాల్ జిల్లా పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కటయ్యా చౌక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. NH-327E పై ఉన్న బజరంగబలి ఆలయం వద్ద రోడ్డు పక్కన కూర్చుని కీర్తనలు పాడుకుంటున్న ఆరుగురిపైకి అదుపు తప్పిన కారు దూసుకెళ్లింది.

బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి, అతివేగంగా వస్తున్న కారు బీభత్సం సృష్టించింది. సుపాల్ జిల్లా పిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కటయ్యా చౌక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. NH-327E పై ఉన్న బజరంగబలి ఆలయం వద్ద రోడ్డు పక్కన కూర్చుని కీర్తనలు పాడుకుంటున్న ఆరుగురిపైకి అదుపు తప్పిన కారు దూసుకెళ్లింది. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
ఢీకొట్టిన తీవ్రతకు, ఆ కారు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న రోడ్డు పక్క దుకాణాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టిలో దాస్ (65), రాజో దాస్ (50), మరియు సురేంద్ర యాదవ్ (45) అక్కడికక్కడే మరణించారు. టిలో దాస్, రాజో దాస్ 12వ వార్డు నివాసులు కాగా, సురేంద్ర యాదవ్ 15వ వార్డుకు చెందినవారు. ప్రమాదం జరిగిన తరువాత, అక్కడ భయానక వాతావరణం నెలకొనడంతో చుట్టుపక్కల ప్రాంతాల జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు.
చికిత్స పొందుతూ ఇద్దరు గాయపడిన వారు మరణించారు. ప్రమాదంలో భువనేశ్రీ యాదవ్, రామచంద్ర యాదవ్, కృష్ణ షా తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురినీ వెంటనే మెరుగైన చికిత్స కోసం సదర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరగా, ఇద్దరి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఐదుగురు మరణించారన్న వార్త వినగానే మృతుల కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. సంఘటనా స్థలం నుండి సదర్ ఆసుపత్రి వరకు విషాద వాతావరణం నెలకొంది. చికిత్స పొందుతున్న ఇద్దరు గాయపడిన వారు కూడా మరణించారన్న వార్త వినగానే కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆసుపత్రి ఆవరణలో గందరగోళం సృష్టించారు. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు, అధికారులు గుంపును శాంతింపజేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, పిప్రా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గురైన కారును పోలీసులు తమ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం వేగం ఎంత, కారు అదుపు తప్పడానికి కారణమేమిటి అనే విషయాలను పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ పాత్రతో పాటు ఇతర అంశాలపై కూడా దర్యాప్తు జరుగుతోంది.
సుపాల్ జిల్లా మేజిస్ట్రేట్ సావన్ కుమార్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, ఉపశమనం కల్పించి, తదుపరి చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
