ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా వైజాపూర్లోని ఒక స్వీట్ షాప్లో కొనుగోలు చేసిన కచోరీలలో ఎలుకల మలం కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఓ కస్టమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆహార పదార్థాల పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహించిన షాప్ యాజమాన్యంపై స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.