AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Election Result: ఫలించిన ప్రధాని మోదీ, నితీశ్ వ్యూహం.. భారీ మెజార్టీ దిశగా ఎన్డీఏ కూటమి..

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. మెజారిటీ మార్క్‌ను దాటి 170 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతోంది.. 243 స్థానాలకు జరుగుతున్న లెక్కింపులో మొదటి నుంచి బీజేపీ, జేడీయూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..

Bihar Election Result: ఫలించిన ప్రధాని మోదీ, నితీశ్ వ్యూహం.. భారీ మెజార్టీ దిశగా ఎన్డీఏ కూటమి..
Bihar Election Result
Shaik Madar Saheb
|

Updated on: Nov 14, 2025 | 12:20 PM

Share

బీహార్ లో ప్రధాని మోదీ అస్త్రం ఫలించింది.. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన మోదీ, నితీష్.. ఆ దిశగా ప్రజలను ఆకట్టుకున్నారు. దీంతో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. మెజారిటీ మార్క్‌ను దాటి 188 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతోంది.. 243 స్థానాలకు జరుగుతున్న లెక్కింపులో మొదటి నుంచి బీజేపీ, జేడీయూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. NDA (బీజేపీ- జేడీయూ) 188 స్థానాల్లో, మహా కూటమి కేవలం (ఆర్జేడీ-కాంగ్రెస్) 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు..

243 సీట్లలో బీజేపీ ప్రభంజనం..

బీజేపీ – 87

జేడీయూ – 76

ఆర్జేడీ – 37

లోక్ జనశక్తి పార్టీ – 19

కాంగ్రెస్ – 6

అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM బలరాంపూర్‌లో ఆధిక్యంలో ఉంది.

బీహార్ ఎన్నికల ఫలితాలు ట్రెండ్స్ చూడండి..

అన్ని రీజియన్లలోనూ NDA కూటమి హవా

అన్ని రీజియన్లలోనూ NDA కూటమి హవా నడుస్తోంది.. 50 సీట్ల దిగువకు మహాఘట్‌బంధన్‌ పడిపోయింది.. ఈ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ ప్రభావం చూపించలేదు.. ముస్లింల ప్రాబల్యం ఉన్న సీమాంచల్‌లో కూడా NDA హవా నడుస్తోంది. NDA కూటమికి సీమాంచల్‌లో 25 సీట్లు, MGBకి 12 సీట్లు ఆధిక్యంలో ఉన్నాయి.. సీమాంచల్‌లో మజ్లిస్‌ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు..

కాంగ్రెస్ కు తీవ్ర నిరాశ..

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మహాఘటబంధన్ తో పొత్తు పెట్టుకుని 61 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన దానికంటే ఎనిమిది స్థానాలు తక్కువ. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 143 స్థానాల్లో 37 స్థానాల్లో, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ 20 స్థానాల్లో 6 స్థానాల్లో, సీపీఐ తొమ్మిది స్థానాల్లో ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 12 స్థానాల్లో పోటీ చేస్తున్న వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6 – 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. చారిత్రాత్మకంగా 67.13 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 7.45 కోట్ల మంది ఓటర్లు 2,616 మంది అభ్యర్థుల విధిని నిర్ణయించడానికి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..