AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మీరు వడ్డీ లేకుండా రూ.10వేల వరకు తీసుకోవచ్చు…

మీరు ప్రభుత్వ ఉద్యోగులా ... అయితే ఇది మీకు గుడ్ న్యూస్.. కేవలం మీకు మాత్రం కేంద్ర ప్రభుత్వం  అందిస్తున్న బంపర్ ఆఫర్.. వడ్డీ లేకుండా రూ.10,000 వరకు ముందస్తు..

ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మీరు వడ్డీ లేకుండా రూ.10వేల వరకు తీసుకోవచ్చు...
ECI - Elections 2021
Sanjay Kasula
|

Updated on: Mar 15, 2021 | 1:43 PM

Share

Big News Government of India: మీరు ప్రభుత్వ ఉద్యోగులా … అయితే ఇది మీకు గుడ్ న్యూస్.. కేవలం మీకు మాత్రం కేంద్ర ప్రభుత్వం  అందిస్తున్న బంపర్ ఆఫర్.. వడ్డీ లేకుండా రూ.10,000 వరకు ముందస్తు పథకాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకునేందుకు 2021 మార్చి 31 వరకు అవకాశం ఉంది.

స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్(Special Festival Advance Scheme)‌తోపాటు ఎల్టీసీ క్యాష్ వోచర్ (LTC cash voucher scheme) పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు చివరి అవకాశం ఉంది. కరోనా సంక్షోభం ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలను ప్రారంభించింది.

ఈ రెండు పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి చివరి తేదీ 31 మార్చి 2021గా నిర్ణయించింది కేంద్రం. ఎప్పుడు, ఎలా ఈ పథకాలను ఎవరు సద్వినియోగం చేసుకోవచ్చో  ఇక్కడ తెలుసుకుందాం..

(1) ప్రత్యేక పండుగ అడ్వాన్స్ పథకం (Special Festival Advance Scheme)‌

ఎల్‌టీసీ క్యాష్ వోచర్ పథకం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు 10,000 రూపాయల వడ్డీ లేని అడ్వాన్స్‌ను అందిస్తోంది. ఇచ్చిన అడ్వాన్స్ గరిష్టంగా 10 వాయిదాలలో చెల్లించవచ్చు. ఈ ప్రత్యేక పండుగ అడ్వాన్స్‌ను సద్వినియోగం చేసుకోవడానికి చివరి తేదీ 31 మార్చి 2021.

స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద, ప్రీపెయిడ్ రుపే కార్డు ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు రూ .10,000 వడ్డీ లేకుండా అందిస్తోంది. ఈ మొత్తాన్ని 31 మార్చి 2021 లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఈ అడ్వాన్స్‌ను 10 వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ అనేది పడిపోయింది. ముఖ్యంగా ప్రజల ఆదాయాలు పడిపోవడంతో విపణిలో స్తబ్దత నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం పలు రంగాల్లో డిమాండ్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను ప్రకటించింది.

(2) ఎల్‌టిసి క్యాష్ వోచర్ పథకం (LTC cash voucher scheme)

ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు సెలవుల ఎన్‌కాష్‌మెంట్‌, అలాగే మూడుసార్లు టికెట్ ఛార్జీలను నగదుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే, 12 శాతం కన్నా తక్కువ ఉన్న జీఎస్టీ కలిగిన ఆహారేతన ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ, దీనిని సద్వినియోగం చేసుకోవటానికి, వారు డిజిటల్ లావాదేవీ ద్వారా చెల్లింపు చేయవలసి ఉంటుంది. అలాగే జీఎస్టీ ఇన్వాయిస్ కూడా చూపించాల్సి ఉంటుంది.

అయితే  ఎల్‌టీసీ క్యాష్ వోచర్ పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు మార్చి 31, 2021 తీసుకోవడానికి చివరి తేదీ. ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 12 న ప్రకటించింది.

తిరిగి చెల్లించాల్సిన మొత్తం ఉపయోగించిన అడ్వాన్స్ కంటే తక్కువగా ఉంటే.., అది ‘అండర్-యుటిలైజేషన్’ గా పరిగణించబడుతుంది. ఏదేమైనా,  లెక్కించిన తరువాత, మిగిలిన మొత్తాన్ని ఉద్యోగి నుండి తిరిగి పొందవచ్చు. ఎల్‌టిసిలలో దేనినైనా ఉద్యోగులు ఉపయోగించవచ్చు.

 ఇవి కూడా చదవండి..

Masiero Naked Protests: అవార్డుల పండగ వేడుకలో నిరసన గళం.. బట్టలు విప్పేసిన ఉత్తమ నటి..

Mydukur Mayor: మైదుకూరు జనం ఎవరిని ఓడించారు..? ఎవరి గెలిపించారు..? మరి పీఠం ఎక్కేది ఎవరు..?