AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్‌లోకి మోదీ మాస్కులు.. భలే గిరాకీ అవుతున్నాయట..

కరోనా కష్టం కాలంలో కూడా మార్కెట్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా కట్టడిలో భాగంగా బయటకు వెళ్తే మాస్క్‌ తప్పనిసరి అన్న నిబంధనలను దాదాపు అన్ని రాష్ట్రాలు విధించాయి.

మార్కెట్‌లోకి మోదీ మాస్కులు.. భలే గిరాకీ అవుతున్నాయట..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 16, 2020 | 5:39 PM

Share

కరోనా కష్టం కాలంలో కూడా మార్కెట్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా కట్టడిలో భాగంగా బయటకు వెళ్తే మాస్క్‌ తప్పనిసరి అన్న నిబంధనలను దాదాపు అన్ని రాష్ట్రాలు విధించాయి. ఈ క్రమంలో మాస్క్‌లకు భలే గిరాకీ పెరుగుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని బోపాల్‌ వ్యాపారస్థులు మోదీ మాస్క్‌లను విక్రయిస్తున్నారు. మాస్క్‌లకు మోదీ బొమ్మ వచ్చేలా ప్రింట్‌ చేసి అమ్ముతున్నారు. అంతేకాదు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫేస్‌ మాస్క్‌లను కూడా విక్రయిస్తున్నారు. వీటిని ప్రింట్ చేసి అమ్ముతున్నట్లు దుకాణం యజామాని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు వెయ్యి మాస్క్‌ల వరకు మోదీ చిత్రాన్ని ప్రింట్ చేసినవి అమ్మామని తెలిపారు. వీటిని రూ.80/- నుంచి రూ.100/- వరకు అమ్ముతున్నామన్నారు. మోదీ ఫోటోతో ఉన్న మాస్క్‌లకు మంచి గిరాకీ ఉందని.. అలాగే పలువురు బాలీవుడ్‌ నటీనటులకు సంబంధించిన మాస్క్‌లను కూడా ప్రింట్ చేసి అమ్ముతున్నట్లు దుకాణ యజమానులు చెబుతున్నారు.