AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రాన్స్‌లో మన స్టార్టప్‌ల సత్తా.. భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన ప్రహ్లాద్ జోషి

మన కాలేజీ ల్యాబ్‌లలో పుట్టిన సరికొత్త టెక్ ఆలోచనలు ఇప్పుడు గ్లోబల్ వేదికలపై సత్తా చాటుతున్నాయి. ఫ్రాన్స్‌లో భారతీయ యువ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు సాధించిన అద్భుత విజయాలను డాక్యుమెంట్ చేస్తూ కేంద్ర విద్యాశాఖ రూపొందించిన భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక పుస్తకాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విడుదల చేశారు.

ఫ్రాన్స్‌లో మన స్టార్టప్‌ల సత్తా.. భారత్ ఇన్నోవేట్స్ ప్రత్యేక బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన ప్రహ్లాద్ జోషి
Union Minister Pralhad Joshi
Krishna S
|

Updated on: Sep 09, 2026 | 8:38 PM

Share

దేశ అభివృద్ధి ప్రస్థానంలో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవస్థాపకతలకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత ప్రాధాన్యం కల్పిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. భారత్-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో భాగంగా 2026 జూన్ 14 నుంచి 16 వరకు ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో విజయవంతంగా నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ తొలి ఎడిషన్ సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక బుక్‌లెట్‌ను ఆయన న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశంలోని యువ పరిశోధకులు తమ సరికొత్త ఆలోచనలను అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, నిపుణులకు పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఒక గొప్ప వేదికగా నిలిచిందన్నారు. మన దేశ విద్యార్థులు, యువతకు సరైన అవకాశాలు, పెట్టుబడులు తోడైతే ప్రపంచ స్థాయి విజయాలు సాధించవచ్చని ఈ కార్యక్రమం నిరూపించిందని ప్రశంసించారు.

వికసిత్ భారత్ లక్ష్యంలో ఉన్నత విద్యాసంస్థల పాత్ర

కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మన కాలేజీలు, యూనివర్సిటీల పాత్ర కీలకమన్నారు. సరికొత్త జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంచుతున్నామని.. దానికి భారత్ ఇన్నోవేట్స్ వంటి వేదికలు ఊతం ఇస్తున్నాయని చెప్పారు.

ల్యాబ్ నుంచి మార్కెట్‌కు.. మన క్యాంపస్ నుంచి ప్రపంచానికి

కాలేజీలు, పరిశోధనా కేంద్రాల్లో తయారయ్యే అత్యాధునిక టెక్నాలజీ ఆలోచనలను కేవలం ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా, నేరుగా మార్కెట్‌లోకి తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 120 స్టార్టప్‌లు, 45 ప్రాజెక్టులు పాల్గొన్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు, బడా కంపెనీలకు తమ టెక్నాలజీని చూపించి వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం మన యువతకు దక్కింది. ఈ విజయాలు, పరిశోధకుల ప్రతిభను రికార్డు చేస్తూ ఈ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించారు.

Follow Us