AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామాలయ నిర్మాణానికి మోదీ సర్కార్ ఇచ్చిన విరాళం ఇదే.. ఎంతో అనుకునేరు..

అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోవడంతో.. ఇక మందిర నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణం కోసం.. స్వతంత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంట్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా.. “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం” పేరుతో ఈ ట్రస్టును ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఆలయ నిర్మాణానికి దేశ ప్రజలంతా సహకరించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ రామమందిర నిర్మాణం కోసం […]

రామాలయ నిర్మాణానికి మోదీ సర్కార్ ఇచ్చిన విరాళం ఇదే.. ఎంతో అనుకునేరు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 06, 2020 | 12:17 PM

Share

అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోవడంతో.. ఇక మందిర నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణం కోసం.. స్వతంత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంట్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా.. “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం” పేరుతో ఈ ట్రస్టును ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఆలయ నిర్మాణానికి దేశ ప్రజలంతా సహకరించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులో 15 మంది ట్రస్టీలు ఉంటారని.. వారిలో ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన వారు కూడా ఉంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాగా ఈ ట్రస్టుకు చైర్మన్‌గా పరాశరన్‌‌ను నియమించారు.

కాగా.. అయోధ్య రామమందిర నిర్మాణానాకి గాను ..”శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం”కి మోదీ సర్కార్.. ప్రభుత్వం తరఫున విరాళాన్ని ప్రకటించింది. అది కూడా కేవలం ఒక్కరూపాయిని మాత్రమే. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము.. స్పష్టం చేశారు. ట్రస్టు సభ్యులకు ఒక రూపాయి నగదును అందజేశామన్నారు. ఈ సందర్భంగా.. రామమందిర నిర్మాణం కోసం ఎవరైనా విరాళాలను ఇస్తే.. వాటిని ఎటువంటి షరతు లేకుండా స్వీకరిస్తామన్నారు. నగదు, ఆస్తుల రూపంలో ఇచ్చినా .. ట్రస్టు స్వీకరిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రస్టు మాజీ అటార్నీ జనరల్‌ పరాశరన్‌ ఇంటిని కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలను కొనసాగించనున్నారు. త్వరలోనే ఈ “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం” ట్రస్టుకు అధికారిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే